Begin typing your search above and press return to search.

హైకోర్టులో జగన్ కు ఊరట..!

By:  Tupaki Desk   |   26 Nov 2020 4:45 AM GMT
హైకోర్టులో జగన్ కు ఊరట..!
X
ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టులో ఉన్న ఒక ఈడీ చార్జిషీట్ ను కూడా సీబీఐ కోర్టుకే బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 30న నాంపల్లి కోర్టులో కేసు విచారణ ఉన్నందున ఆరోజు బదిలీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది.

జగన్ ఆస్తుల కేసులపై సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) సీబీఐ కోర్టులో ఆరు చార్జిషీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఒక చార్జిషీట్ దాఖలు చేసింది.

సీబీఐ కోర్టులో ప్రధాన కేసులు పెండింగ్ లో ఉన్నాయి. నాంపల్లి కోర్టులో అరబిందో, హెటిరో భూ కేటాయింపులకు సంబంధించిన ఈడీ కేసు కూడా పెండింగ్ ఉంది. ఈ క్రమంలోనే సీబీఐ కోర్టుకే ఈడీ కేసు బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్స్ కోరింది.

నాంపల్లి కోర్టు దీన్ని నిరాకరించడంతో హైకోర్టును జగతి పబ్లికేషన్స్ ఆశ్రయించింది. విచారణ జరిపి అన్ని ఒకే చోట విచారణ జరిపేందుకు వీలుగా అరబిందో, హెటిరో ఈడీ కేసు కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.