Begin typing your search above and press return to search.
హరీష్ పాలి‘ట్రిక్స్’: పొద్దున బీజేపీ.. రాత్రికి టీఆర్ఎస్
By: Tupaki Desk | 20 Nov 2020 10:15 AM ISTపలు పార్టీలకు చెందిన నాయకుల కప్పదాట్లు మొదలయ్యాయి. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి రాత్రికి రాత్రే జంప్ జిలానీలుగా మారుతున్నారు. గ్రేటర్ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని, తమను పట్టించుకోవడం లేదని, ప్రచారంలో బాధ్యతలు అప్పగించడం లేదని ఇలా పలు రకాల కారణాలతో వారు పార్టీలు మారుతున్నారు.
గురువారం ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీఆర్ఎస్పై అసహనంతో గురువారం ఉదయం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న ఓ నాయకుడు రాత్రయ్యే సరికి సొంత గూటికి చేరారు. మంత్రి హరీశ్ రావు ఆయన్ను వెనక్కు పిలిపించినట్లుగా ప్రకటించారు.
గురువారం ఉదయం వెంగళ్ రావు నగర్ సిట్టింగ్ టీఆర్ఎస్ కార్పొరేటర్ కిలారి మనోహర్, రామచంద్రాపురం కార్పొరేటర్ అంజయ్య యాదవ్లు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో గురువారం బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో వెంటనే మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. అంజయ్య యాదవ్కు నచ్చ జెప్పి మళ్లీ సొంత గూటికి లాక్కొచ్చారు.
ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుంటే ప్రచారం ఎలా చేయాలి, ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, విజయం ఎలా సొంతం చేసుకోవాలని వారు ఆలోచిస్తుంటే అసంతృప్తులు మాత్రం వారిని నిద్ర పోనివ్వడం లేదు. ఎన్నికల బరిలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. నామినేషన్ల ఉపసంహరణ వరకు రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన వారిని ఉపసంహరించుకునేలా చేయడంతోనే తల బొప్పి కట్టగా తాజాగా పార్టీలు మారుతున్న అసంతృప్తులను ఎలా ఆపాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
తెల్లవారితే ఏ పార్టీలో ఏ నాయకుడు ఉంటాడో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎన్నికలకు మరో పది రోజుల గడువు ఉండడంతో ఇంకా ఎంత మంది నాయకులు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి జంప్ చేస్తారోనని స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా వారిని పార్టీ మారకుండా ఉండేలా ఎలా అని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు.
గురువారం ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీఆర్ఎస్పై అసహనంతో గురువారం ఉదయం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న ఓ నాయకుడు రాత్రయ్యే సరికి సొంత గూటికి చేరారు. మంత్రి హరీశ్ రావు ఆయన్ను వెనక్కు పిలిపించినట్లుగా ప్రకటించారు.
గురువారం ఉదయం వెంగళ్ రావు నగర్ సిట్టింగ్ టీఆర్ఎస్ కార్పొరేటర్ కిలారి మనోహర్, రామచంద్రాపురం కార్పొరేటర్ అంజయ్య యాదవ్లు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో గురువారం బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో వెంటనే మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. అంజయ్య యాదవ్కు నచ్చ జెప్పి మళ్లీ సొంత గూటికి లాక్కొచ్చారు.
ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుంటే ప్రచారం ఎలా చేయాలి, ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, విజయం ఎలా సొంతం చేసుకోవాలని వారు ఆలోచిస్తుంటే అసంతృప్తులు మాత్రం వారిని నిద్ర పోనివ్వడం లేదు. ఎన్నికల బరిలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. నామినేషన్ల ఉపసంహరణ వరకు రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన వారిని ఉపసంహరించుకునేలా చేయడంతోనే తల బొప్పి కట్టగా తాజాగా పార్టీలు మారుతున్న అసంతృప్తులను ఎలా ఆపాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
తెల్లవారితే ఏ పార్టీలో ఏ నాయకుడు ఉంటాడో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎన్నికలకు మరో పది రోజుల గడువు ఉండడంతో ఇంకా ఎంత మంది నాయకులు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి జంప్ చేస్తారోనని స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా వారిని పార్టీ మారకుండా ఉండేలా ఎలా అని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు.
