Begin typing your search above and press return to search.

హాజీపూర్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కేసులో కోర్టులో కీలక ట్విస్ట్

By:  Tupaki Desk   |   6 Feb 2020 11:19 AM GMT
హాజీపూర్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కేసులో కోర్టులో కీలక ట్విస్ట్
X
తెలంగాణలోని కలకలం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.సైకో కిల్లర్ గా మారి బాలికలను రేప్ చేసి పూడ్చి పెట్టిన శ్రీనివాస్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది. మొత్తం ముగ్గురు మైనర్లపై శ్రీనివాస రెడ్డి హత్యాచారం చేశాడని నేరం నిరూపితమైంది.

2019 ఆగస్టులో బాలికను నమ్మించి లిఫ్ట్ ఇచ్చి నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లిన శ్రీనివాస్ రెడ్డి ఆమెకు ఊపిరి ఆడకుండా ముక్కు మూసి చంపి అత్యాచారం చేశాడు. అనంతరం శవాన్ని బావిలో వేశాడు. ఆ బాలిక మృతదేహం బయట పడడంతో పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు బయటపడ్డాయి. 11 ఏళ్ల బాలికను ఇలాగే చంపినట్టు తేలింది. ఇతని పై మొత్తం 4 హత్య కేసులు.. ఓ మహిళ ను లైంగికంగా వేధించిన కేసు నిరూపితమైంది.

అయితే తనకు ఈ హత్యలతో సంబంధం లేదని.. తన ఇల్లు తగులబెట్టారని శ్రీనివాసరెడ్డి జడ్జికి రోధిస్తూ వివరించారు. తాను నిరపరాధినని వాదించాడు. తన తల్లిదండ్రులకు ఆసరా లేదని పేర్కొన్నారు. కానీ సాక్ష్యాల ఆధారంగా ముగ్గురు మైనర్ బాలికను చంపి అత్యాచారం చేసినట్టు తేలిందని కోర్టు జడ్జి తేల్చారు. ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డి దోషిగా ప్రకటించారు. శిక్షను త్వరలోనే ఖరారు చేస్తారు.