Begin typing your search above and press return to search.
గుజరాత్లోని ఆ శ్మశాన వాటిక ఎందుకు వార్తల్లోకి ఎక్కిందంటే
By: Tupaki Desk | 30 May 2020 4:49 PM GMTప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇలాకా అయిన గుజరాత్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో మరణాలు సైతం భారీగానే సంభవిస్తున్నాయి. రాజధాని అహ్మదాబాద్లో సున్నీ ముస్లింలకు చెందిన గంజ్ షాహిద్ శ్మశానానికి శవాల తాకిడి ఎక్కువవడం, అది మునుపెన్నడూ లేని రీతిలో ఉండటంతో కరోనా సమయంలో ఈ ఖబ్రస్థాన్ పేరు మారిమోగిపోతోంది.
ఆ శ్మశానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తు, 2019, ఏప్రిల్ నెలలో ఆ శ్మశానంలో కేవలం 66 మంది సున్నీల మృతదేహాలకు మాత్రమే అంత్యక్రియలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే 199 మంది జరిగాయి. ఇక గత ఏడాది మే నెలలో 61 మృతదేహాలకు మాత్రమే అంత్యక్రియలు జరిగాయని రికార్డులు స్పష్టం చేస్తుండగా, ఈ ఏడాది మే నెలలో, మొదటి 25 రోజుల్లో 376 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. అంటే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలకు మరణాల సంఖ్య దాదాపు రెండింతలయింది. ప్రాణాంతక కరోనా వైరస్ కబళించడం వల్లనే శ్మశానంలో అంత్యక్రియల సంఖ్య అంతగా పెరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నగరంలోని ముస్లింల శ్మశానాల నిర్వహించే సున్నీ వక్ఫ్ బోర్డు అధిపతి రిజ్వాన్ ఖాద్రిని ఇదే విషయమై సంప్రదించగా, నగరంలోని తమ సున్నీ ముస్లింలకు చెందిన అన్ని శ్మశానాల్లో అంత్యక్రియల సంఖ్య ఈ సారి చాలా ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. ఏప్రిల్ నెల నుంచి మే 25వ తేదీ వరకు 575 మంది సున్నీలు మరణించగా, వారిలో 147 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు.
కాగా, . కరోనా వైరస్కు గుజరాత్ రాష్ట్రంలో ‘హాట్స్పాట్’గా ఉన్న అహ్మదాబాద్ నగరంలో ఇప్పటి వరకు 11,163 కరోనా కేసులు నిర్ధారణ కాగా, వారిలో 773 మంది మరణించారు. మరణాల సంఖ్య ఏకంగా 6.9 శాతం ఉండడం ఆందోళనకరం. ఒక్క ముస్లింలకు చెందిన శ్మశానంలోనే కాకుండా ఇతర శ్మశానాల్లో కూడా అంత్యక్రియల సంఖ్య బాగా పెరిగాయి. నగరంలోని ‘అంతిమ్ ధామ్’ శ్మశానంలో గతేడాది మే నెలలో 180 అంత్యక్రియలు జరగ్గా, ఈ ఏడాది మే నెలలో 350 అంత్యక్రియలు జరిగాయి.
ఆ శ్మశానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తు, 2019, ఏప్రిల్ నెలలో ఆ శ్మశానంలో కేవలం 66 మంది సున్నీల మృతదేహాలకు మాత్రమే అంత్యక్రియలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే 199 మంది జరిగాయి. ఇక గత ఏడాది మే నెలలో 61 మృతదేహాలకు మాత్రమే అంత్యక్రియలు జరిగాయని రికార్డులు స్పష్టం చేస్తుండగా, ఈ ఏడాది మే నెలలో, మొదటి 25 రోజుల్లో 376 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. అంటే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలకు మరణాల సంఖ్య దాదాపు రెండింతలయింది. ప్రాణాంతక కరోనా వైరస్ కబళించడం వల్లనే శ్మశానంలో అంత్యక్రియల సంఖ్య అంతగా పెరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నగరంలోని ముస్లింల శ్మశానాల నిర్వహించే సున్నీ వక్ఫ్ బోర్డు అధిపతి రిజ్వాన్ ఖాద్రిని ఇదే విషయమై సంప్రదించగా, నగరంలోని తమ సున్నీ ముస్లింలకు చెందిన అన్ని శ్మశానాల్లో అంత్యక్రియల సంఖ్య ఈ సారి చాలా ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. ఏప్రిల్ నెల నుంచి మే 25వ తేదీ వరకు 575 మంది సున్నీలు మరణించగా, వారిలో 147 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు.
కాగా, . కరోనా వైరస్కు గుజరాత్ రాష్ట్రంలో ‘హాట్స్పాట్’గా ఉన్న అహ్మదాబాద్ నగరంలో ఇప్పటి వరకు 11,163 కరోనా కేసులు నిర్ధారణ కాగా, వారిలో 773 మంది మరణించారు. మరణాల సంఖ్య ఏకంగా 6.9 శాతం ఉండడం ఆందోళనకరం. ఒక్క ముస్లింలకు చెందిన శ్మశానంలోనే కాకుండా ఇతర శ్మశానాల్లో కూడా అంత్యక్రియల సంఖ్య బాగా పెరిగాయి. నగరంలోని ‘అంతిమ్ ధామ్’ శ్మశానంలో గతేడాది మే నెలలో 180 అంత్యక్రియలు జరగ్గా, ఈ ఏడాది మే నెలలో 350 అంత్యక్రియలు జరిగాయి.