Begin typing your search above and press return to search.
మందుబాబులకు తీపికబురు .. త్వరలో ఆ బ్రాండ్ల ధరలు తగ్గబోతున్నాయట !
By: Tupaki Desk | 23 Feb 2021 7:30 AM GMTప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చి పెట్టె మందుబాబులకు కేంద్రం అతి త్వరలో తీపికబురు చెప్పబోతోంది. త్వరలో పలు బ్రాండ్ల పై ధరలు తగ్గించే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉంది. యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న వైన్స్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని ఆలోచిస్తుంది. ఈ కారణంగా విదేశీ వైన్స్లో చాలా బ్రాండ్లు ప్రస్తుతం ఉన్న ధర కంటే తక్కువ ధరకే లభించే అవకాశాలున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు, కేంద్ర ఆహార ఉత్పత్తుల తయారీ, ఆల్కహాలిక్ బేవరేజ్ మ్యాన్యూఫాక్చర్స్ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా యూరోపియన్ యూనియన్ తో యూరప్-ఇండియా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్నయం తీసుకుంది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా యూరప్ ఆల్కహాల్ బ్రాండ్లపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని భావిస్తోంది.
కాగా, ప్రస్తుతం విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 150 శాతం కస్టమ్స్ డ్యూటీని విధిస్తోంది. ఈయూ-ఇండో వాణిజ్య ఒప్పందంలో భాగంగా కస్టమ్స్ డ్యూటీని 75 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే విదేశీ మద్యం బ్రాండ్లు ఇప్పుడున్న ధరకంటే తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. అయితే విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంవల్ల దేశీయ ఆల్కహాల్ ఉత్పత్తి కంపెనీల బిజినెస్ విస్తరణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. కాగా, సీఐఏబీసీ గణాంకాల ప్రకారం.. యూరప్ నుంచి భారత్ ఏడాదికి రూ.1,850 కోట్ల వైన్ ను దిగుమతి చేసుకుంటోంది. కేవలం రూ.160 కోట్ల వైన్ ను మాత్రమే యూరప్ కు ఇండియా ఎగుమతి చేస్తోంది. దేశీయ ఆల్కహాల్ ఉత్పత్తుల వార్షిక టర్నోవర్ భారత్ లో రూ.4.5 లక్షల కోట్లు ఉంది.
కాగా, ప్రస్తుతం విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 150 శాతం కస్టమ్స్ డ్యూటీని విధిస్తోంది. ఈయూ-ఇండో వాణిజ్య ఒప్పందంలో భాగంగా కస్టమ్స్ డ్యూటీని 75 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే విదేశీ మద్యం బ్రాండ్లు ఇప్పుడున్న ధరకంటే తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. అయితే విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంవల్ల దేశీయ ఆల్కహాల్ ఉత్పత్తి కంపెనీల బిజినెస్ విస్తరణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. కాగా, సీఐఏబీసీ గణాంకాల ప్రకారం.. యూరప్ నుంచి భారత్ ఏడాదికి రూ.1,850 కోట్ల వైన్ ను దిగుమతి చేసుకుంటోంది. కేవలం రూ.160 కోట్ల వైన్ ను మాత్రమే యూరప్ కు ఇండియా ఎగుమతి చేస్తోంది. దేశీయ ఆల్కహాల్ ఉత్పత్తుల వార్షిక టర్నోవర్ భారత్ లో రూ.4.5 లక్షల కోట్లు ఉంది.