Begin typing your search above and press return to search.

నిరుద్యోగులకు తీపి కబురు

By:  Tupaki Desk   |   30 Jan 2019 7:13 AM GMT
నిరుద్యోగులకు తీపి కబురు
X
నిరుద్యోగుల ఆశలు 2019 సంవత్సరంలో తీరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 2018 సంవత్సరంతో పొలిస్తే ఈ ఏడాది 31శాతం అధికంగా నియమాకాలు చేసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు పెంచాయని మెర్సల్ మెటిల్ రెండో వార్షిక నివేదికలో ‘నైపుణ్యాల నియమాకాలు స్థితి-2019’ పేరిట వెల్లడించింది.

నియామక ప్రక్రియలో అభ్యర్థులకు సాంకేతిక పరిజ్ఞానం వారి ఎంపికలో కీలక భూమిక పోషిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. ఆయా కంపెనీలు మెరుగైన నైపుణ్యలు ఉన్నవారిని ఎంపిక చేసుకునేందుకు నియమాకాల ధోరణి కొత్త పద్ధతులను అవలంబించనున్నాయి. నైపుణ్యాలు నిపుణుల ఎంపిక చేసుకోవడంలో సాంకేతిక వినియోగించుకోవాలని భావిస్తున్నాయి.

దేశంలో వివిధ సంస్థల్లో నియమకాలు జరిపే ఉన్నతాధికారుల నుంచి, విభాగాధిపతులు తదితర 900మంది నుంచి సేకరించిన సమాచారంతో మెర్సల్ సంస్థ ఈ నివేదికను వెల్లడించింది. పెద్ద సంస్థలకు ఈ విషయంలో నిపుణుల ఎంపికలో ఇబ్బందులు ఎదురకావడంలేదని 67శాతం మంది తెలిపారని పేర్కొంది. కీలక పోస్టుల్లో మాత్రం అభ్యర్థుల దొరకడం లేదని పలువురు తెలిపినట్లు ఆ సంస్థ పేర్కొంది.

ముఖ్యంగా డిమాండ్ ఉన్న రంగాల్లో నైపుణ్యం ఉన్న అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారిందని పేర్కొంది. వీరి ఎంపికకు అధిక వ్యయంతో పాటు సమయం పడుతుంది. నైపుణ్యం వారి కోసం తీవ్ర పోటి నెలకొంది. భిన్న పదవుల కోసం ఉత్తమమైన వారికి ఎంపిక చేయడం సవాలుగా మారిందని ఆ సంస్థ వెల్లడించింది. ఏదిఏమైనా ఏమైనా 2019 సంవత్సరం నియామక ప్రక్రియ ధోరణిలో మార్పులు రావడంతోపాటు నిరుద్యోగులకు తీపి కబురు పంచనుందని మెర్సిల్ సంస్థ ప్రకటించింది. నిరుద్యోగులు ఇప్పటికైనా సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టిసారిస్తే ఈ ఏడాది వారికి తీపి కబురు ఖాయంగా కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు.. ఆ దిశగా అడుగులు వేయండి మరీ.