Begin typing your search above and press return to search.

క్రికెట్ లవర్స్​ కు గుడ్​ న్యూస్​.. దుబాయ్​లో ఐపీఎల్​ కొనసాగింపు..!

By:  Tupaki Desk   |   29 May 2021 11:30 AM GMT
క్రికెట్  లవర్స్​ కు గుడ్​ న్యూస్​.. దుబాయ్​లో ఐపీఎల్​ కొనసాగింపు..!
X
కరోనా ప్రభావంతో ఐపీఎల్​ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్​ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. మళ్లీ ఎప్పుడు ఐపీఎల్​ స్టార్ట్​ అవుతుంది? అంటూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్​ లో ఇప్పటికే కొన్ని మ్యాచ్​లు పూర్తయ్యాయి. మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో జరగబోతున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఈ ఊహాగానాలే నిజమయ్యాయి. ఐపీఎల్​ లో మిగిలిన మ్యాచ్ లను యూఏఈ వేదికగా కొనసాగించబోతున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

గత సీజన్​ ఐపీఎల్​ కూడా యూఏఈలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం ఐపీఎల్​ భారత్​ లోనే నిర్వహించారు. కానీ ఐపీఎల్​ ప్రారంభమయిన కొద్ది రోజులకే కరోనా కేసులు పెరిగాయి. మరోవైపు కొందరు క్రికెటర్లు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రేక్షకులు లేకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకొని బయోబబల్ పద్ధతిలో ఐపీఎల్​ నిర్వహించారు. అయినప్పటికీ ఐపీఎల్​ ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో ఐపీఎల్​ ను వాయిదా వేయాల్సి వచ్చింది.


ఇవాళ బీసీసీఐ ప్రత్యేకంగా సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఐపీఎల్​ నిర్వహణపై చర్చించారు. 2021లో ఐపీఎల్​లో మిగిలిన మ్యాచ్​లను యూఏఈలో నిర్వహించబోతున్నట్టు బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్​ లో కూడా ఓ ప్రకటన చేసింది.

సెప్టెంబర్, అక్టోబర్ లో మిగిలిన మ్యాచ్​లు జరగనున్నాయి. ఐపీఎల్ 2021 లో 31 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. కచ్చితమైన తేదీలు ప్రకటించనున్నారు. ఇండియాలో టీ20 ప్రపంచకప్​ కూడా జరగాల్సి ఉంది. ఇందుకోసం అన్ని దేశాల జట్లు సిద్ధంగా ఉన్నాయా? తదితర విషయాలపై కూడా బీసీసీపై చర్చిస్తోంది.