Begin typing your search above and press return to search.

మరో ముఖ్యమంత్రికి సోకిన కరోనా !

By:  Tupaki Desk   |   2 Sept 2020 3:00 PM IST
మరో ముఖ్యమంత్రికి సోకిన కరోనా !
X
కంటికి క‌నిపించ‌ని క‌రోనా మహమ్మారి ప్ర‌పంచ‌ దేశాల్లో అలజడి సృష్టిస్తుంది. సామ్యానుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు అందరికి సోకుతూ అందరిని వణికిపోయేలా చేస్తుంది. మ‌న దేశంలోనూ కరోనా ఉధృతి శరవేగంగా ఉంది. ఈ వైరస్‌ కు చిక్కకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యపడటం లేదు. చాలా జాగ్రత్తలు తీసుకునే రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు సైతం ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో కరోనా పేరు చెబితే భయపడుతున్నారు.

తాజాగా గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ కూడా క‌రోనా మహమ్మారి బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింద‌ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే తనకు క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు అని , ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉంటున్న‌ట్లు గోవా ముఖ్యమంత్రి తెలిపారు. ఇంటి నుంచే త‌న కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తాన‌ని వెల్లడించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సీఎం సావంత్ విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాకుండా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమోద్ సావంత్ కరోనా బారినపడిన నాలుగో సీఎం. ఇంతకు ముందు ముగ్గురు ముఖ్యమంత్రులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ కు కరోనా సోకింది. వీరిలో ఇప్పటికే యడియూరప్ప, శివరాజ్ సింగ్ పూర్తిగా కోలుకున్నారు.