Begin typing your search above and press return to search.

కొలువుల కోత.. ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీలకు తప్పని తిప్పలు

By:  Tupaki Desk   |   20 July 2022 3:30 AM GMT
కొలువుల కోత.. ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీలకు తప్పని తిప్పలు
X
కరోనా మహమ్మారి  ధాటికి ఉద్యోగ, ఉపాధి కరువైంది. ఇక దాని వల్ల వచ్చిన ఆర్థికమాంద్యంతో అంతా అతలాకుతలమైంది. ఆర్థిక మాంద్యం భయాలతో సాఫ్ట్ వేర్ సహా ఇతర కంపెనీలు కుదేలవుతున్నాయి. నిధుల కొరతతో ఈ కంపెనీలు ఇప్పుడు నేలచూపు చూస్తున్నాయి. దీంతో నిర్వహణ భారాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి.

ఈ ఏడాది మొత్తంగా ఒక్క భారత్ లో స్టార్టప్ సంస్థలు 60వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఓ ప్రముఖ నివేదిక అంచనావేసింది. ఇప్పటికే పలువురు పలు ప్రముఖ స్టార్టప్ సంస్థలు దాదాపు 12వేల మంది ఉద్యోగులను ఇంటిదారి చూపించాయి.దీంతో ఉద్యోగులు తమ ఉద్యోగాలను పెద్ద ఎత్తున కోల్పోతున్నారు. కరోనా తర్వాత అందరి పనివిధానం మారింది. వర్క్ ఫ్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతితోపాటు ఆన్ లైన్ సేవలందించే సంస్థలు స్టార్టప్ సంస్థలు పుట్టుకొచ్చాయి. గడిచిన కరోనా కాలంలోని రెండేళ్లలో ఆంతా ఆన్ లైన్ ఉద్యోగాలే నడిచాయి. ఇప్పుడిప్పుడే ఉద్యోగులు ఆఫీసుల బాటపడుతున్నాయి.  

ఐటీ సంస్థలు మొదలు అన్ని రకాల పరిశ్రమలు డిజిటలైజేషన్ కు ప్రాధాన్యం ఇస్తారని వార్తలొచ్చాయి.  కానీ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం పరిస్థితులను మార్చేసింది. వివిధ వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడంతో కీలక వడ్డీ రేట్లుసైతం పెరిగాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుపోయింది.

ఆర్థిక మాంద్యం దెబ్బకు అమెరికాలో 22వేల మంది ఐటీ నిపుణుల ఉద్యోగాలు గల్లంతయ్యాయి. ఈ మాంద్యం ఎఫెక్ట్ అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిరుత్సాహ పూరిత వాతావరణంలో కొత్తగా నిధులు సమకూర్చుకోవడంలో కంపెనీలు ఇబ్బందులు పాలవుతున్నాయి.

ఇప్పటికే అంతర్జాతీయంగా నెట్ ఫ్లిక్స్ , రాబిన్ హండ్  అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు, పలు క్రిప్టో ఫ్లాట్ ఫామ్స్ తమ సిబ్బందిలో కోత విధించాయి. క్రిప్టో వరల్డ్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఆర్థికంగా పతనం కావడంతో కాయిన్ బేస్, జెమినీ, క్రిప్టో డాట్ కామ్, వౌల్డ్, బైబిట్, బిట్ పాండా తదితర క్రిప్టో ఎక్స్జేంజ్ లు, సంస్థలు తమ ఉద్యోగులను కుదించుకుంటున్నట్లు ప్రకటించాయి. పోకేమోన్ గో గేమ్ డెవలపర్ నియాంటిక్ 8 శాతం తమ సిబ్బందిని కంపెనీ నుంచి  వైదొలగాలని కోరింది.

ఇవే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలు ఖర్చును తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించడం.. కొత్తగా నియామకాలు ఆపేయడం చర్చనీయాంశంగా మారింది.  మైక్రోసాఫ్ట్ ఇటీవల 1800 మంది ఉద్యోగులను.. నెట్ ఫ్లిక్స్ 450 మంది ఉద్యోగులను తొలగించింది. ట్విటర్ అక్విజిషన్ టీంలో 30శాతం సిబ్బందిని తొలగించినట్లు సమాచారం.

టెస్లా సంస్థ కూడా ఆటోపైలట్ విభాగంలో 229 మంది ఉద్యోగులపై వేటు వేయగా.. మరో 10శాతం ఉద్యోగులకు ఇదే పరిస్థితి ఎదురుకానుందని సంకేతాలు పంపింది.