Begin typing your search above and press return to search.

ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ కు కరోనా అంటించిన గర్ల్ ఫ్రెండ్

By:  Tupaki Desk   |   23 April 2020 12:30 PM GMT
ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ కు కరోనా అంటించిన గర్ల్ ఫ్రెండ్
X
ప్రభుత్వాలు ఎంత కట్టడి చేద్దామని చూసినా కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంతో కొందరు అంటించేస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బయటపడ్డ కరోనా పాజిటివ్ కేసు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక గర్ల్ ఫ్రెండ్ ఏకంగా తన ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ కు కరోనా అంటించిందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఇండోర్ లోని లుసాడియా గ్రామానికి చెందిన ఒక యువతికి కరోనా పాజిటివ్ సోకింది. అప్రమత్తమైన అధికారులు ఆమె ఎక్కడ, ఎవరితో తిరిగిందనే దానిపై శూలశోధన మొదలు పెట్టారు. మొదటగా ఆమె కుటుంబ సభ్యులను, ఆ తర్వాత ఓ బాయ్ ఫ్రెండ్ కుటుంబాన్ని ఐసోలేషన్ లో ఉంచారు.

అయితే పోలీస్ విచారణలో ఆమెకు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసింది. దీంతో ఆ మూడు కుటుంబాల వారిని తీసుకెళ్లి తాజాగా ఐసోలేషన్ లో ఉంచారు.

ఇక ముగ్గురు బ్యాయ్ ఫ్రెండ్స్ లలో ఒకడికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట.. వారితో సన్నిహితంగా మెలిగాడట..దీంతో ఆ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కుటుంబాలను వెతికే పనిలో పోలీసులు పడ్డారు. ఇలా కరోనా వైరస్ చైన్ సిస్టం ఒకరి నుంచి మరొకరికి.. పెరుగుకుంటూ పోతూనే ఉంది. దీనికి అంతమెప్పుడోనన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది.