Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 54 రోజులుగా ఒంటరిగా!

By:  Tupaki Desk   |   11 May 2020 7:45 AM GMT
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 54 రోజులుగా ఒంటరిగా!
X
లాక్‌ డౌన్‌ నేపథ్యంలో జర్మనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఒకరు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఎడ్గార్డ్ జీబాట్ అనే జర్మన్‌ జాతీయుడు 54 రోజులుగా ఒంటరిగా ఇక్కడే ఉండిపోయాడు. మార్చి 18న హనోయి నుంచి ఇస్తాంబుల్ ‌కు వెళ్తూ అతడు ఇక్కడ చిక్కుబడిపోయాడు. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో టర్కీ నుంచి, అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమానాలను భారత్ రద్దు చేసింది. నాలుగు రోజుల తర్వాత అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించి కొనసాగిస్తోంది

ఇతర ప్రయాణికుల మాదిరిగా ఎడ్గార్డ్ జీబాట్ ‌ను జర్మనీ రాయబార కార్యాలయానికి అప్పగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమ దేశంలో అతడికి నేరచరిత్ర ఉన్నందున అతడిని క్వారంటైన్ ‌ను పంపడానికి ఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయం నిరాకరించింది. నేర చరిత్ర ఉన్నందున భారత్‌ కూడా అతడికి వీసా ఇవ్వలేదు. అతడిని స్వదేశానికి పంపే విషయంపై జర్మన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఇప్పటివరకు స్పందన రాలేదని భారత అధికారులు తెలిపారు.

జీబాట్‌ మార్చిన 18న వియత్నాం నుంచి వీట్ ‌జెట్‌ ఎయిర్ విమానంలో ఢిల్లీ వచ్చాడు. తన గమ్య స్థానానికి వెళ్లే విమానాలన్నీ రద్దు కావడంతో ఇక్కడే ఉండిపోయాడు. దినపత్రికలు, మేగజీన్స్‌ చదువుతూ.. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ అతడు కాలక్షేపం చేస్తున్నాడు. తాను కోరుకున్న చోటికి వెళ్లిపోవచ్చని చెప్పినా విమాన సర్వీసులు లేకపోవడంతో అతడు వెళ్లలేక పోతున్నాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు. రిలీఫ్‌ విమానంలో అంకారాకు పంపేందుకు ప్రయత్నించినా టర్కీ అందుకు ఒప్పుకోకపోవడంతో కుదరలేదని వెల్లడించారు. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యేవరకు అతని నిరీక్షణ తప్పదు. కాగా, జీబాట్‌ తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులను సెక్యురిటీ సిబ్బంది అనుమతించలేదు