Begin typing your search above and press return to search.

మధ్యప్రదేశ్ కోటల్లో గౌతమీపుత్రుడు

By:  Tupaki Desk   |   21 Aug 2016 6:03 AM GMT
మధ్యప్రదేశ్ కోటల్లో గౌతమీపుత్రుడు
X
నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ కి గత నెల చివర్లో బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే. ఆగస్ట్ మొదటివారంలో క్రిష్ పెళ్లి కావడంతోనే ఇలా బ్రేక్ వేయాల్సి వచ్చింది. స్వయంగా బాలకృష్ణే ఈ బ్రేక్ ఇచ్చారు. అయితే.. సంక్రాంతి టార్గెట్ మిస్ కాకుండా ఉండేదుకు.. పిక్చరైజ్ చేసిన భాగానికి గాను గ్రాఫిక్స్ వర్క్ మాత్రం నడుస్తూనే ఉంది. ఇప్పుడు తాజా షెడ్యూల్ ని ఖరారు చేసి.. మళ్లీ షూటింగ్ చేసేయబోతున్నారు.

బాలకృష్ణ సహా మొత్తం యూనిట్ అంతా ఈ నెలాఖర్లో మధ్యప్రదేశ్ వెళ్లబోతున్నారు. అక్కడి కోటల్లోను.. అడవుల్లోనూ రాజప్రాసాదాలకు సంబంధించిన సన్నివేశాలు.. పలు కీలక సీన్స్ ను తీయనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని కూడా పాల్గొనబోతున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణిలో.. రాజమాత గౌతమిగా హేహమాలిని నటిస్తున్నారు.

కోటలకు సంబంధించిన ఎపిసోడ్స్ కావడంతో.. ఈ షెడ్యూల్ లో తీయనున్న సీన్స్ లో కాస్ట్యూమ్ డిజైనర్.. ఆర్ట్ డైరెక్టర్ల పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. అనుకోకుండా కలిసొచ్చిన నెల రోజుల సమయాన్ని వీరు అద్భుతంగా ఉపయోగించుకుని.. మరింత పక్కాగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నారట. ఇక మధ్యప్రదేశ్ లో 23 రోజుల పాటు షూటింగ్ చేసుకుని.. తిరిగి హైద్రాబాద్ రానుంది బాలయ్య అండ్ టీం.