Begin typing your search above and press return to search.
శాపం అంటే ఇదేనేమో.. ఒకరనుకొని మరొకరిని చంపిన గ్యాంగ్
By: Tupaki Desk | 25 Sept 2020 9:15 AM ISTవాళ్లు కరడుగట్టిన నేరగాళ్లు.. సుపారీ తీసుకోవడం, మనుషులను చంపడం వారివృత్తి. కేవలం డబ్బులు ఇస్తే ఎవరి ప్రాణం తీయడానికైనా ఈ గ్యాంగ్ రెడీగా ఉంటుంది. అయితే రీసెంట్గా ఓ వ్యక్తిని చంపేందుకు ఈ గ్యాంగ్ డబ్బు తీసుకుంది. ముఠా పక్కా స్కెచ్ వేసి చంపాలనుకున్న వ్యక్తి ఇళ్లు, తరచూ తిరిగే ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారు. అతడు వాడే బైక్ కలర్, బైక్ నంబర్ నోట్చేసుకున్నారు. టార్గెట్ వ్యక్తిని హత్యచేసేందుకు పక్కా టైమ్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఓ చిన్నపొరపాటుతో వాళ్లు లెక్కతప్పారు. ఒకరిని చంపబోయి.. మరో అమాయకుడని పొట్టనబెట్టుకున్నారు.
ఇంతకూ ఏం జరిగింది..
హైదరాబాద్లోని షాహిన్ నగర్కు చెందిన పరాన్ గతంలో పలువురిని మోసం చేశాడు. తనకు సబ్బుల ఫ్యాక్టరీ ఉందని నమ్మించి కొంతమందిని మోసం చేశాడు. వారి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు. దీంతో అతడి మీద పహాడీషరీఫ్ పీఎస్లో కేసు కూడా నమోదైంది. అయితే ప్రస్తుతం పరాన్ పరారీలో ఉన్నాడు. అయితే అతడి చేతిలో మోసపోయిన కొందరు పరాన్పై తీవ్రంగా కోపం పెంచుకున్నారు. అతడిని ఎలాగైనా చంపాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా సుపారీ ఇచ్చారు. పరాన్ చంపేందుకు నిందితులు స్కెచ్ వేశారు. అతడి ఇంటి సమీపంలో కాపు కాసి కూర్చున్నారు.
ఈక్రమంలో మంగళవారం రాత్రి పరాన్ ఇంటికి అతని స్నేహితులు షాహిన్ సయ్యద్ మోమిన్ అలీ(24), ఖాలెద్ వచ్చారు. వీరంతా రాత్రంతా ఫుల్లుగా మందు తాగారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున పరాన్ తనకు ఆకలిగా ఉందని తినడానికి ఏమన్నా తీసుకురావాలని ఫ్రెండ్స్కు చెప్పాడు. దీంతో సయ్యద్ మోమిన్ అలీ(24), ఖాలెద్ బయటకు వచ్చారు. అయితే మార్గ మధ్యంలో వారిని గ్యాంగ్ వాహనం ఫాలో అయ్యింది. కొద్దిసేపటికి ఆ వాహనంలో నంచి నలుగురు కిందకు దిగారు. వారు మోమిన్ అలీపై కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే పరాన్గా భావించిన నిందితులు మోమిన్ ను హత్య చేశారని పోలీసులు చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
పరాన్ చేతిలో మోసపోయిన బాధితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక వాళ్లు ఎవరికైనా సుపారీ ఇచ్చి హత్యచేయించేందుకు ప్లాన్ చేశారా? అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇంతకూ ఏం జరిగింది..
హైదరాబాద్లోని షాహిన్ నగర్కు చెందిన పరాన్ గతంలో పలువురిని మోసం చేశాడు. తనకు సబ్బుల ఫ్యాక్టరీ ఉందని నమ్మించి కొంతమందిని మోసం చేశాడు. వారి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు. దీంతో అతడి మీద పహాడీషరీఫ్ పీఎస్లో కేసు కూడా నమోదైంది. అయితే ప్రస్తుతం పరాన్ పరారీలో ఉన్నాడు. అయితే అతడి చేతిలో మోసపోయిన కొందరు పరాన్పై తీవ్రంగా కోపం పెంచుకున్నారు. అతడిని ఎలాగైనా చంపాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా సుపారీ ఇచ్చారు. పరాన్ చంపేందుకు నిందితులు స్కెచ్ వేశారు. అతడి ఇంటి సమీపంలో కాపు కాసి కూర్చున్నారు.
ఈక్రమంలో మంగళవారం రాత్రి పరాన్ ఇంటికి అతని స్నేహితులు షాహిన్ సయ్యద్ మోమిన్ అలీ(24), ఖాలెద్ వచ్చారు. వీరంతా రాత్రంతా ఫుల్లుగా మందు తాగారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున పరాన్ తనకు ఆకలిగా ఉందని తినడానికి ఏమన్నా తీసుకురావాలని ఫ్రెండ్స్కు చెప్పాడు. దీంతో సయ్యద్ మోమిన్ అలీ(24), ఖాలెద్ బయటకు వచ్చారు. అయితే మార్గ మధ్యంలో వారిని గ్యాంగ్ వాహనం ఫాలో అయ్యింది. కొద్దిసేపటికి ఆ వాహనంలో నంచి నలుగురు కిందకు దిగారు. వారు మోమిన్ అలీపై కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే పరాన్గా భావించిన నిందితులు మోమిన్ ను హత్య చేశారని పోలీసులు చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
పరాన్ చేతిలో మోసపోయిన బాధితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక వాళ్లు ఎవరికైనా సుపారీ ఇచ్చి హత్యచేయించేందుకు ప్లాన్ చేశారా? అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
