Begin typing your search above and press return to search.
టీడీపీ మాజీ మంత్రికి కోర్టులో ఊరట..!
By: Tupaki Desk | 24 Aug 2020 10:00 PM ISTటీడీపీ నేత.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 14 షరతులతో.. లక్ష రూపాయల పూచీకత్తుతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు సమాచారం.
మచిలీపట్నంకు చెందిన వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర నిందితుడిగా ఉన్నారు. ఈ హత్య ఆయన డైరెక్షన్ లోనే జరిగిందని ఫిర్యాదులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్య జరిగిన తరువాత కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. విశాఖకు వెళ్తున్న క్రమంలో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు తునిలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులను తరలించారు. ఇక కోర్టు ఆదేశాలతో ఆయన రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
మచిలీపట్నంకు చెందిన వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర నిందితుడిగా ఉన్నారు. ఈ హత్య ఆయన డైరెక్షన్ లోనే జరిగిందని ఫిర్యాదులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్య జరిగిన తరువాత కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. విశాఖకు వెళ్తున్న క్రమంలో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు తునిలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులను తరలించారు. ఇక కోర్టు ఆదేశాలతో ఆయన రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
