Begin typing your search above and press return to search.
పట్టుకోండి చుద్దాం! లండన్ లో మకాం వేసిన నవాజ్ షరీఫ్..అరెస్ట్ వారెంట్ జారీ
By: Tupaki Desk | 19 Sept 2020 1:20 PM ISTఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్షరీఫ్. ఆయన కుమారుడు మర్యమ్లను ఇస్లామామాద్ హైకోర్టు దోషిగా తేల్చింది. ప్రస్తుతం వారిమీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. అయితే వారిద్దరూ మాత్రం దర్జాగా లండన్ లో ఉంటున్నారు. దీంతో నవాజ్షరీఫ్ అరెస్ట్ కు పాకిస్థాన్ తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
నవాజ్షరీఫ్ మీద ఉన్న కేసు ఏంటి?
నవాజ్ షరీఫ్ మీద పలు అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అయితే 2018లో ఇస్లామాబాద్ కోర్టు అతడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా తాను అనారోగ్యంతో ఉన్నానని.. వైద్యం కోసం లండన్ వెళ్లాలని లాహోర్ హైకోర్టులో అర్జీ పెట్టుకున్నారు. దీంతో నాలుగు వారాలపాటు లండన్ వెళ్లేందుకు గత ఏడాది నవంబర్ లో హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే నాలుగు వారాలు పూర్తైనా నవాజ్ షరీఫ్ పాక్కు తిరిగి రాలేదు. వైద్యం కోసం మరింత సమయం కావాలని నవాజ్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో అతడికి 8 వారాలపాటు గడవు పొడిగించారు. అయినప్పటికీ నవాజ్ తిరిగి రాలేదు.
మరోవైపు నవాజ్ దర్జాగా లండన్లో షాపింగ్ చేస్తున్నట్టు.. బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో అతడి పై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యం లో నవాజ్ను తమకు అప్పగించాలంటూ ఈ ఏడాది ఆగస్టు లో పాకిస్థాన్.. బ్రిటన్ ను కోరింది. నవాజ్ షరీఫ్ అరెస్టు కోసం పంపిన వారెంట్ను అందుకున్నట్లు లండన్లోని పాక్ హైకమిషన్ కార్యాలయం తెలిపింది. నవాజ్ను సెప్టెంబరు 22న ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరు పర్చాలని కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ విదేశాంగ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. నవాజ్ పాక్కు తిరిగొస్తాడా.. మరోసారి కోర్టును ఆశ్రయిస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది.
నవాజ్షరీఫ్ మీద ఉన్న కేసు ఏంటి?
నవాజ్ షరీఫ్ మీద పలు అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అయితే 2018లో ఇస్లామాబాద్ కోర్టు అతడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా తాను అనారోగ్యంతో ఉన్నానని.. వైద్యం కోసం లండన్ వెళ్లాలని లాహోర్ హైకోర్టులో అర్జీ పెట్టుకున్నారు. దీంతో నాలుగు వారాలపాటు లండన్ వెళ్లేందుకు గత ఏడాది నవంబర్ లో హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే నాలుగు వారాలు పూర్తైనా నవాజ్ షరీఫ్ పాక్కు తిరిగి రాలేదు. వైద్యం కోసం మరింత సమయం కావాలని నవాజ్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో అతడికి 8 వారాలపాటు గడవు పొడిగించారు. అయినప్పటికీ నవాజ్ తిరిగి రాలేదు.
మరోవైపు నవాజ్ దర్జాగా లండన్లో షాపింగ్ చేస్తున్నట్టు.. బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో అతడి పై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యం లో నవాజ్ను తమకు అప్పగించాలంటూ ఈ ఏడాది ఆగస్టు లో పాకిస్థాన్.. బ్రిటన్ ను కోరింది. నవాజ్ షరీఫ్ అరెస్టు కోసం పంపిన వారెంట్ను అందుకున్నట్లు లండన్లోని పాక్ హైకమిషన్ కార్యాలయం తెలిపింది. నవాజ్ను సెప్టెంబరు 22న ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరు పర్చాలని కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ విదేశాంగ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. నవాజ్ పాక్కు తిరిగొస్తాడా.. మరోసారి కోర్టును ఆశ్రయిస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది.
