Begin typing your search above and press return to search.

తిరుపతి ఉప ఎన్నికలు-2019 ఎన్నికల ఫలితాలపై ఫోకస్

By:  Tupaki Desk   |   9 April 2021 5:30 PM GMT
తిరుపతి ఉప ఎన్నికలు-2019 ఎన్నికల ఫలితాలపై ఫోకస్
X
తిరుపతిలో ఇప్పుడు పరువు కోసమే పోరాటం నడుస్తోంది. గత మెజారిటీ సాధించాలని వైసీపీ.. గతాన్ని తిరగరాయలని టీడీపీ.. మధ్యలో ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని బీజేపీ -జనసేన కృతనిశ్చయంతో ఉన్నాయి. మరి గెలుపు ఎవరిది? అన్నది ఆసక్తిగా మారింది.

తిరుపతి పార్లమెంట్ కు జరుగుతున్న ఉప ఎన్నికల మీద పెద్ద ఎత్తున బెట్టింగ్ లు నడుస్తున్నాయట.. అలాగే వైసీపీ గెలుపు ఖాయమని.. దానికి ఎంత మెజారిటీ వస్తుందని ప్రధానంగా బెట్టింగులు నడుస్తున్నాయట.. వైసీపీ ఏమో తాము ఖచ్చితంగా 5 లక్షల మెజార్టీ సాధిస్తామని ఘంటాపథంగా చెబుతుంటే.. టీడీపీ మాత్రం ఈసారి తప్పకుండా పాగా వేస్తామని చెప్తోంది. ఇక మధ్యలో బీజేపీ-జనసేన మేమే గెలుస్తాం అని అంటోంది. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఆ పార్టీ అభ్యర్థి సీనియర్ కావడంతో తనకు సైలెంట్ ఓటింగ్ పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఇలా ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 2019తో పోల్చినప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్న దానిపై ఓ లుక్ వేద్దాం..

*2019 ఎన్నికల్లో ఫలితాల ప్రకారం.. తిరుపతి పార్లమెంట్ లో నియోజకవర్గాల ప్రకారం ఓట్లు ఇవీ..

-వెంకటగిరి
వైసీపీ -109204
టీడీపీ- 70484
మెజారిటీ - 38720

-సర్వేపల్లి
వైసీపీ -97272
టీడీపీ-83229
మెజారిటీ -13973

-గూడురు
వైసీపీ - 109759
టీడీపీ - 64301
మెజారిటీ -- 45459

-సూళ్లూరుపేట
వైసీపీ -119627
టీడీపీ -58335
మెజారిటీ - 61292

-తిరుపతి
వైసీపీ - 80554
టీడీపీ - 79836
మెజారిటీ - 718

- శ్రీకాళహస్తి
వైసీపీ - -109541
టీడీపీ- 79836

-సత్యవేడు
వైసీపీ -103941
టీడీపీ-59197
మెజారిటీ - 44744

2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. మెజార్టీ ఒక్కో నియోజకవర్గంలో లక్ష దాటింది. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితి క్షేత్రస్తాయిలో వేరే ఉందని సమాచారం. వెంకటగిరి ఎమ్మెల్యే, గూడు ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ మీద అలిగి ఉన్నారంట.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మీద లోకల్ గా కరోనా వల్ల వ్యతరేకత వచ్చిందట..

తిరుపతిలో 2019 ఎన్నికల్లో కేవలం 718 మెజారిటీ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యేల మీద ప్రజలకు ఆసక్తి లేకున్నా.. జగన్ ను చూసి ప్రజలు ఓట్లు చేశారు తప్పితే అక్కడ ఎమ్మెల్యేలను చూసి వేయలేదు. అందుకే జగన్ ను చూసి ఓటేయడంతో బాగా మెజారిటీ వస్తుందని అంటున్నారు.

కానీ క్షేత్రస్థాయిలో ఎవరు పెద్దగా సర్వేలు చేయడం లేదు అంట.. ఎందుకంటే ఎలాగూ వైసీపీ గెలుస్తుందని అందరూ విశ్వాసంతోనే ఉన్నారు. కానీ ఎంత మెజారిటీ వస్తుందనేది కీలకం అని విశ్లేషకులు అంటున్నారు. గత సారి కంటే తగ్గితే టీడీపీ, జనసేన బీజేపీ వాళ్లు మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తారని.. ప్రెస్ మీట్లు పెట్టి నానా యాగీ చేస్తారు కాబట్టి వైసీపీ బాళ్లు గట్టిగా కృషి చేస్తున్నారంట.. కాబట్టి మెజార్టీ కోసం వైసీపీ.. తగ్గించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న మాట..