Begin typing your search above and press return to search.

దేశముదురు గ్యాంగ్​.. పోలీసులకే చెమటలు!

By:  Tupaki Desk   |   4 Sept 2020 2:20 PM IST
దేశముదురు గ్యాంగ్​.. పోలీసులకే చెమటలు!
X
సైబర్​ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఏదొక విధంగా ఉచ్చులోకి లాగి అనుమానం తలెత్తేలోపే అందినకాడికి దోచుకు పోతున్నారు. ఫేస్​బుక్​లో ఎస్సై ఫొటోను ఫ్రొఫైల్​ పిక్​గా పెట్టి డబ్బులు వసూలు చేసిన ఓ మాఠా ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా అద్దంకిలో కలకలం రేపింది. అద్దంకి ఎస్సై వేలగా మహేశ్​ పేరుతో సైబర్​ ముఠా ఓ నకిలీ ఫేస్​బుక్​ ఐడీని క్రియేట్​ చేసింది. అనంతరం అతడికి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ పంపిన వారందరినీ యాక్సెప్ట్​ చేస్తూ.. డబ్బులు అడగడం మొదలు పెట్టారు. తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని వెంటనే పదివేలు పంపించాలంటూ ఎస్సై పేరుతో మెసేజ్​లో వచ్చేవి. నమ్మిన కొందరు వ్యక్తులు .. సదరు వ్యక్తుల చెప్పిన గూగుల్​ పే నంబర్​కు డబ్బులు పంపించారు.

ఫ్రెండ్​ లిస్ట్​లో ఉన్న పలువురు ఎస్సై స్నేహితులు డబ్బులు పంపించారు. తర్వాత ఓ సారి ఎస్సై కలిసినప్పడు డబ్బులు పంపిన విషయం ప్రస్తావించారు. దీంతో అసలు మోసాన్ని గ్రహించిన ఎస్సై విచారణ చేపట్డడంతో మోసగాళ్ల అసలు రంగు బయటపడింది. దీంతో ఎస్సై ఫేస్​బుక్​ లైవ్​ పెట్టి తన పేరుతో ఓ ఫేక్​ ఐడీని క్రియేట్​ చేశారని.. అర్జెంట్​గా రూ.10 వేలు డబ్బులు కావాలని డిమాండ్​ చేస్తున్నారని.. వారిని అస్సలు నమ్మోద్దని చెప్పాడు. దీనిపై పోలీస్​శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఈ సైబర్​ ముఠా మరికొందరు పోలీసుల పేరుతోకూడా ఫేక్​ ఐడీని క్రియేట్​ చేసినట్టు సమచారం. ప్రస్తుతం ఆ ముఠాలో ఎవరెవరు ఉన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.