Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ తో ఈటెల రాజేంద‌ర్ భేటీ!

By:  Tupaki Desk   |   14 Jun 2017 5:11 PM IST
జ‌గ‌న్ తో ఈటెల రాజేంద‌ర్ భేటీ!
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ కలిశారు. ఈ భేటీ బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌ లో జ‌రిగింది. ఈట‌ల రాజేంద‌ర్ కుమారుడి వివాహం త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుంది.

తన కుమారుడు నితిన్‌ వివాహానికి హాజరు కావాల్సిందిగా జ‌గ‌న్‌ ను ఈటెల ఆహ్వానించారు. తన కుమారుడి వివాహానికి హాజ‌రు కావాల‌ని రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే.

వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలసి మే 25న‌ న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లారు. శనివారం రాత్రి హైదరాబాద్‌ కు చేరుకున్నారు. జగన్‌ ను ఈటెల నేరుగా క‌లిసి వివాహ‌ ఆహ్వానం అందించారు. నితిన్‌ పెళ్లి ఈ జూన్‌ 18న హైదరాబాద్‌ లోని హైటెక్స్‌లో జరగనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/