Begin typing your search above and press return to search.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు..
By: Tupaki Desk | 1 Jun 2022 8:00 PM ISTనేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. వారిద్దరికి సమన్లు జారీ చేసింది. జూన్ 2న రాహుల్ గాంధీని, జూన్ 8వ తేదీ లోపు సోనియా గాంధీని విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది. ఈ మేరకు వారిద్దరికి సమన్లు జారీ చేసింది. అయితే తాను దేశంలో లేనని.. ఈడీ హాజరు కావడానికి సమయం కావాలని రాహుల్ గాంధీ కోరారని కాంగ్రెస్ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా తెలిపారు. దీంతో రాహుల్ గాంధీని కూడా సోనియా గాంధీతోపాటు జూన్ 8లోపు తమ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. తమ పార్టీ అగ్ర నేతలిద్దరికి ఈడీ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇప్పుడు విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేయడం విశేషం. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను కక్ష సాధింపు చర్యగా పేర్కొంది. 1942లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రారంభించారని.. ఆ సమయంలో బ్రిటిష్ వారు దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారని గుర్తు చేసింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఈడీని ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. పగ, రాజకీయ కారణాలు, కాంగ్రెస్ నాయకులపై ద్వేషం వంటి కారణాలతోనే బీజేపీ ప్రభుత్వం ఈ కేసులు నమోదు చేసిందని మండిపడ్డారు.
ఇక నేషనల్ హెరాల్డ్ కేసు పూర్వాపరాల్లోకి వస్తే.. నేషనల్ హెరాల్డ్ పత్రికను దివంగత భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో స్థాపించారు. ఇందులో నెహ్రూతో పాటు 5000 మంది స్వాతంత్ర్య సమరయోధులు వాటాదారులుగా ఉన్నారు. ఈ పత్రిక అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్) ఆధ్వర్యంలో నడిచేది. నష్టాల కారణంగా 2008లో పత్రిక మూతపడింది. పత్రిక మూతపడే నాటికి ఇందులో వాటాదారుల సంఖ్య 1000కి తగ్గింది.
మూతపడిన నేషనల్ హెరాల్డ్ ప్రతికను తిరిగి ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏజెఎల్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇచ్చింది. అయినప్పటికీ ఆ పత్రిక ప్రారంభం కాలేదు. పైగా ఏజెఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి రూ.90 కోట్లు బకాయి పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఆ రూ.90 కోట్లు అప్పు సోనియా, రాహుల్లకు చెందిన యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్)కు బదలాయించింది. అంత అప్పు చెల్లించుకోలేని స్థితిలో ఉన్న ఏజెఎల్ అప్పులకు బదులు సంస్థ వాటాలన్నింటినీ వైఐఎల్కు బదలాయించింది. ఇందుకు గాను వైఐఎల్ సంస్థ కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించింది.
అలా ఏజెఎల్ వాటా మొత్తాన్ని సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన వైఐఎల్కు బదలాయించడం ద్వారా ఆ సంస్థకు చెందిన రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా వైఐఎల్ సొంతమయ్యాయి. ఏజెఎల్లో మిగతా వాటాదారులను విస్మరించి ఏకపక్షంగా ఈ వ్యవహారం జరగడం... కేవలం రూ.90 కోట్ల అప్పుకు సంస్థ ఆస్తులన్నీ బదలాయించడం.. ఇదంతా చట్ట విరుద్దంగా జరిగిన వ్యవహారమనే ఆరోపణలున్నాయి.
ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ చోటు చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై 2012లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏజెఎల్-వైఐఎల్ మధ్య జరిగిన వ్యవహారంలో సోనియా, రాహుల్లు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు, ఓ రాజకీయ పార్టీ పబ్లికేషన్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఇదే కేసులో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ సోనియా, రాహుల్కు సమన్లు జారీ చేసింది.
2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇప్పుడు విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేయడం విశేషం. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను కక్ష సాధింపు చర్యగా పేర్కొంది. 1942లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రారంభించారని.. ఆ సమయంలో బ్రిటిష్ వారు దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారని గుర్తు చేసింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఈడీని ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. పగ, రాజకీయ కారణాలు, కాంగ్రెస్ నాయకులపై ద్వేషం వంటి కారణాలతోనే బీజేపీ ప్రభుత్వం ఈ కేసులు నమోదు చేసిందని మండిపడ్డారు.
ఇక నేషనల్ హెరాల్డ్ కేసు పూర్వాపరాల్లోకి వస్తే.. నేషనల్ హెరాల్డ్ పత్రికను దివంగత భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో స్థాపించారు. ఇందులో నెహ్రూతో పాటు 5000 మంది స్వాతంత్ర్య సమరయోధులు వాటాదారులుగా ఉన్నారు. ఈ పత్రిక అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్) ఆధ్వర్యంలో నడిచేది. నష్టాల కారణంగా 2008లో పత్రిక మూతపడింది. పత్రిక మూతపడే నాటికి ఇందులో వాటాదారుల సంఖ్య 1000కి తగ్గింది.
మూతపడిన నేషనల్ హెరాల్డ్ ప్రతికను తిరిగి ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏజెఎల్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇచ్చింది. అయినప్పటికీ ఆ పత్రిక ప్రారంభం కాలేదు. పైగా ఏజెఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి రూ.90 కోట్లు బకాయి పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఆ రూ.90 కోట్లు అప్పు సోనియా, రాహుల్లకు చెందిన యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్)కు బదలాయించింది. అంత అప్పు చెల్లించుకోలేని స్థితిలో ఉన్న ఏజెఎల్ అప్పులకు బదులు సంస్థ వాటాలన్నింటినీ వైఐఎల్కు బదలాయించింది. ఇందుకు గాను వైఐఎల్ సంస్థ కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించింది.
అలా ఏజెఎల్ వాటా మొత్తాన్ని సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన వైఐఎల్కు బదలాయించడం ద్వారా ఆ సంస్థకు చెందిన రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా వైఐఎల్ సొంతమయ్యాయి. ఏజెఎల్లో మిగతా వాటాదారులను విస్మరించి ఏకపక్షంగా ఈ వ్యవహారం జరగడం... కేవలం రూ.90 కోట్ల అప్పుకు సంస్థ ఆస్తులన్నీ బదలాయించడం.. ఇదంతా చట్ట విరుద్దంగా జరిగిన వ్యవహారమనే ఆరోపణలున్నాయి.
ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ చోటు చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై 2012లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏజెఎల్-వైఐఎల్ మధ్య జరిగిన వ్యవహారంలో సోనియా, రాహుల్లు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు, ఓ రాజకీయ పార్టీ పబ్లికేషన్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఇదే కేసులో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ సోనియా, రాహుల్కు సమన్లు జారీ చేసింది.
