Begin typing your search above and press return to search.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. కేంద్రం కొత్త మెలిక
By: Tupaki Desk | 13 Sept 2020 3:20 PM ISTఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) కోసం 301 సంస్కరణలు అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు డీపీఐఐటీ డిపార్ట్ మెంట్ ఆదేశాలు ఇచ్చింది.2020-21 ర్యాంకుల కోసం మొత్తం 15 విభాగాల్లో నవంబర్ లోగా ఈ సంస్కరణలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ 2019 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఏపీ పరిశ్రమ శాఖ కొత్త మార్గదర్శకాల అమలుకు పకడ్బందీగా ముందుకెళుతోంది.
నవంబర్ లోపే సంస్కరణలు అమలు చేయాల్సి ఉండడంతో ఏపీ పరిశ్రమల శాఖ నంబర్ 1 ర్యాంకును కాపాడుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగ అధిపతులతో సమావేశాలు నిర్వహించి మర్గదర్శకాలపై అవగాహన కల్పిస్తోంది. సంస్కరణలు అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
ఈ ఏడాది కొత్తగా టెలికాం, పర్యాటకం, ట్రేడ్ లైసెన్స్, ఆతిథ్యం, హెల్త్ కేర్, తూనికొలు కొలతలు, సినిమా హాళ్లు, సినిమా షూటింగ్ ల విభాగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టబోతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ పేర్కొంది. ఎలాగైనా సరే ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది.
కాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ 2019 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఏపీ పరిశ్రమ శాఖ కొత్త మార్గదర్శకాల అమలుకు పకడ్బందీగా ముందుకెళుతోంది.
నవంబర్ లోపే సంస్కరణలు అమలు చేయాల్సి ఉండడంతో ఏపీ పరిశ్రమల శాఖ నంబర్ 1 ర్యాంకును కాపాడుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగ అధిపతులతో సమావేశాలు నిర్వహించి మర్గదర్శకాలపై అవగాహన కల్పిస్తోంది. సంస్కరణలు అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
ఈ ఏడాది కొత్తగా టెలికాం, పర్యాటకం, ట్రేడ్ లైసెన్స్, ఆతిథ్యం, హెల్త్ కేర్, తూనికొలు కొలతలు, సినిమా హాళ్లు, సినిమా షూటింగ్ ల విభాగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టబోతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ పేర్కొంది. ఎలాగైనా సరే ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది.
