Begin typing your search above and press return to search.

డ్రంకెన్​ డ్రైవ్​ చేసేవాళ్లు.. పదేళ్లు జైలుకే..! సీపీ సజ్జనార్ హెచ్చరిక

By:  Tupaki Desk   |   29 Dec 2020 4:40 PM IST
డ్రంకెన్​ డ్రైవ్​ చేసేవాళ్లు.. పదేళ్లు జైలుకే..!  సీపీ సజ్జనార్ హెచ్చరిక
X
మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపక్షించేది లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్​ హెచ్చరించారు. ఇక నుంచి సైబరాబాద్​ పరిధిలో తరచూ డ్రంకెన్​ డ్రైవ్​ నిర్వహిస్తామని హెచ్చరించారు. పట్టుబడ్డ వాళ్లపై 304 సెక్షన్​ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పదేళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందు తాగి డ్రైవింగ్​ చేసేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఒక్కరోజే సైబరాబాద్​ పరిధిలో 402 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని హెచ్చరించారు. హైదరాబాద్​లో ఇప్పటికే న్యూ ఇయర్​ వేడుకలు నిషేధించామని గుర్తుచేశారు.

కొత్త స్ట్రెయిన్​ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పబ్బులు, క్లబ్బలు, బార్లలోనే కాకుండా ఎక్కగా న్యూఇయర్​ పార్టీలు చేసుకోవద్దని చెప్పారు. అపార్ట్​మెంట్లు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీప్రదేశాల్లో కూడా జనాలు గుంపుగా చేరొద్దని న్యూఇయర్​ వేడుకలు చేసుకోవద్దని హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్​ విస్తరిస్తున్నందున ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు హైదరాబాద్​లో కొత్త స్ట్రెయిన్​ విస్తరిస్తున్నది. ఇప్పటికే రెండు కొత్త స్ట్రెయిన్​ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్రవైద్యశాఖ కేంద్ర ఆరోగ్యశాఖకు తెలిపింది. బ్రిటన్​ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది. హైదరాబాద్​తో పాటు బెంగళూరు, పూణేల్లోను కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఆరు కొత్త రకం కరోనా కేసులను గుర్తించినట్టు సమాచారం.