Begin typing your search above and press return to search.

న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లంః డ్ర‌గ్స్ ముఠా అరెస్టు

By:  Tupaki Desk   |   29 Dec 2017 1:19 PM GMT
న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లంః డ్ర‌గ్స్ ముఠా అరెస్టు
X
హైద‌రాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. న‌గరంలో ముగ్గురు నైజీరియన్లను వెస్ట్‌ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్ల నుంచి 225 గ్రాముల కొకైన్, 25 గ్రాముల హెరాయిన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరానికి నైజీరియన్లు డ్రగ్స్ తీసుకువచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రగ్స్ కలకలంపై ఈ ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు.

న్యూఇయ‌ర్ వేడుక‌ల‌కు ఇంకా వారం స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ...హైదరాబాద్‌ మహా నగరంలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే విష‌యంలో పోలీసులు సిద్ధ‌మైపోయారు. ఈ మేర‌కు ప‌లు ఆంక్షలు విధించారు. కొత్త సంవ‌త్సరం సంద‌ర్భంగా నగరంలో ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు జరిపే రెస్టారెంట్లు - పబ్‌ లు - క్లబ్‌ లు - బార్లు - ఈవెంట్‌ నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీసులు తేల్చిచెప్పారు. సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేశారు. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. మద్యం తాగిన వారికి క్యాబ్‌ ను సమకూర్చాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదే అని స్ప‌ష్టం చేశారు. డ్రంకెన్ డ్రైవ్ త‌ప్ప‌కుండా నిర్వ‌హిస్తామ‌న్నారు.

కాగా, నూతన సంవత్సర సందర్భంగా నగరంలోని కొన్ని ప్రాంతాలకు డ్రగ్స్‌ చేరిందని పోలీసులకు ప్రాథమిక సమాచారం అందిందింది. ఈ వేడుకల్లో యువతే లక్ష్యంగా కొకైన్‌ - ఎల్‌ ఎస్‌ డీ - బ్రౌన్‌ షుగర్‌ వంటివి నగరానికి చేరాయని సమాచారం. ఈ సమాచారంతో మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన కెల్విన్‌ ముఠాపై నగర పోలీసులు నిఘా వేశారు. వీరితో పాటుగా మ‌రికొంద‌రిపై కూడా పోలీసులు న‌జ‌ర్ పెట్టిన‌ట్లు స‌మాచారం.