Begin typing your search above and press return to search.
‘క్రిస్మస్ వేడుకలు ఈ సారి వద్దు’ బ్రిటన్ లో ఆంక్షలు
By: Tupaki Desk | 20 Dec 2020 3:20 PM ISTక్రిస్మస్ క్రైస్తవులకు అతిపెద్ద పండగ. ఈ పండగను వాళ్లు బంధుమిత్రులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. క్రైస్తవులు జనాభా అధికంగా ఉండే బ్రిటన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అయితే ఈ ఏడాది క్రిస్మస్ను ఎవరి ఇంట్లో వాళ్లు జరుపుకోవాలని.. భారీ వేడుకలు - సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు బ్రిటన్ లో అత్యవసర లాక్ డౌన్ విధించారు. ప్రజలు తమ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది.
ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. బ్రిటన్ లో ఇంకా కరోనా కేసులు అదుపులోకి రాలేదు. ఇప్పటికే అక్కడ ఫైజర్ టీకాకు అనుమతి ఇచ్చారు. కానీ కరోనా మాత్రం సెకండ్ వేవ్ రూపంలో దూసుకొస్తున్నది. ఒకసారి కరోనా వచ్చి తగ్గినవాళ్లకు కూడా మళ్లీ కరోనా సోకుతున్నది. దీంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయాలని భావించింది.క్రిస్మస్ సందర్భంగా సామూహిక ప్రార్థనలు, వేడుకలు నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉన్నదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
‘ఈ ఏడాది క్రిస్ మస్ వేడుకలు కుటుంబసభ్యులతో జరుపుకోండి’ అంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలకు సూచించారు. ఆదివారం (డిసెంబర్ 20) నుంచి అక్కడ కఠిన లాక్ డౌన్ అమల్లోకి తీసుకొచ్చారు.
దీంతో 16 మిలియన్లకు పైగా బ్రిటన్లు ఇళ్లకే పరిమితం కాబోతున్నారు. క్రిస్మస్ రోజు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చిరించారు. గత వారం లండన్ లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి.
ప్రజలు ఇంట్లోనే ఉండాలి. కేవలం ఆరోగ్యసిబ్బంది - పోలీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అత్యవసర దుకాణాలు తప్ప మిగతా షాపులు క్లోజ్ చేయనున్నారు. క్లబ్బులు. పబ్బులు లాంటివి మూసేయనున్నారు.
ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. బ్రిటన్ లో ఇంకా కరోనా కేసులు అదుపులోకి రాలేదు. ఇప్పటికే అక్కడ ఫైజర్ టీకాకు అనుమతి ఇచ్చారు. కానీ కరోనా మాత్రం సెకండ్ వేవ్ రూపంలో దూసుకొస్తున్నది. ఒకసారి కరోనా వచ్చి తగ్గినవాళ్లకు కూడా మళ్లీ కరోనా సోకుతున్నది. దీంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయాలని భావించింది.క్రిస్మస్ సందర్భంగా సామూహిక ప్రార్థనలు, వేడుకలు నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉన్నదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
‘ఈ ఏడాది క్రిస్ మస్ వేడుకలు కుటుంబసభ్యులతో జరుపుకోండి’ అంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలకు సూచించారు. ఆదివారం (డిసెంబర్ 20) నుంచి అక్కడ కఠిన లాక్ డౌన్ అమల్లోకి తీసుకొచ్చారు.
దీంతో 16 మిలియన్లకు పైగా బ్రిటన్లు ఇళ్లకే పరిమితం కాబోతున్నారు. క్రిస్మస్ రోజు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చిరించారు. గత వారం లండన్ లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి.
ప్రజలు ఇంట్లోనే ఉండాలి. కేవలం ఆరోగ్యసిబ్బంది - పోలీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అత్యవసర దుకాణాలు తప్ప మిగతా షాపులు క్లోజ్ చేయనున్నారు. క్లబ్బులు. పబ్బులు లాంటివి మూసేయనున్నారు.
