Begin typing your search above and press return to search.

ఢిల్లీలో కలకలం: నెగటివ్ వచ్చినా.. డాక్టర్ మృత్యువాత

By:  Tupaki Desk   |   5 July 2020 1:30 AM GMT
ఢిల్లీలో కలకలం: నెగటివ్ వచ్చినా.. డాక్టర్ మృత్యువాత
X
వైరస్​ దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరంగా మారింది. వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మృతులు సంభవిస్తున్నొయి. టాప్-5లో ఢిల్లీ నిలుస్తోంది. దీంతో సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు.. అధికారులు వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా వైద్యులు.. వైద్యారోగ్య సిబ్బంది.. వైరస్ కు బలవడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఓ వైద్యుడి మృతి అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఎందుకంటే టెస్టుల్లో నెగటివ్ వచ్చినా అతడు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.

మౌలానా ఆజాద్​ ఇనిస్టిట్యూట్​ ఫర్ డెంటల్​ సైన్సెస్ (మెయిడ్స్​)​లోని ఓరల్​ సర్జరీ డిపార్టుమెంట్​లో జూనియర్ డాక్టర్ గా అభిషేక్ పని చేస్తున్నారు. ఎయిమ్స్​ ఎండీఎస్​ పరీక్షలో జాతీయ స్థాయిలో 21వ ర్యాంకు తెచ్చుకున్న ఆయన జూన్​ నెలలో హరియాణాలోని రోహ్​తక్​కు వెళ్లి వచ్చారు. టెస్టుల్లో రెండుసార్లు నెగటివ్​ వచ్చిన ఢిల్లీకి చెందిన ఆయన గురువారం చనిపోయారు. అయితే అతడు ప్రాణాలు కోల్పోయేముందు ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం తదితర లక్షణాలు డాక్టర్‌ అభిషేక్ భయానాలో కనిపించాయని మృతుడి సోదరుడు అమన్​ తెలిపారు. తనకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని.. ఈ లక్షణాలన్నీ వైరస్ వేనని.. తనకు కచ్చితంగా​ పాజిటివ్​ వచ్చిందని అభిషేక్ తన చివరి మాటల్లో చెప్పినట్లు వివరించారు.