Begin typing your search above and press return to search.

కరోనా భయంతో విటమిన్ల కోసం ఏడాదిలో చేసిన ఖర్చెంతో తెలుసా ?

By:  Tupaki Desk   |   28 Jun 2021 2:57 AM GMT
కరోనా భయంతో  విటమిన్ల కోసం ఏడాదిలో చేసిన ఖర్చెంతో తెలుసా ?
X
కరోనా మహమ్మారి ఓ ఒక్కరూ మినహాయింపు కాదు. బయటకు బలంగా కనిపించేవారు చాలామంది వైరస్ దెబ్బకి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అలాగే పెద్ద పెద్ద బాడీబిల్డర్లు, క్రీడాకారులు సైతం కరోనా బారిన పడి విలవిల్లాడారు. అయితే బయటకు బక్కపలుచగా కనిపించే కొంతమంది మాత్రం వైరస్ ధాటిని తట్టుకుని నిలబడ్డారు. కారణం వారిలోని రోగనిరోధక శక్తి. పిల్లల్లో కూడా ఈ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండబట్టే. శరీరంలో సహజంగా ఉండే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కరోనా కాలంలో చాలామంది ప్రయత్నాలు ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పండ్లు, డ్రైఫ్రూట్స్ వాడకం పెంచాలని వైద్యులు కూడా చెబుతూ వచ్చారు.

అయితే చాలామంది విటమిన్ సప్లిమెంట్లపై ఆధారపడ్డారు. కరోనా చికిత్సలో కూడా విటమిన్ ట్యాబ్లెట్లను వైద్యులు తప్పనిసరి చేయడంతో వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఆ అలవాటుని చాలామంది కొనసాగించారు. ఈ విటమిన్ సప్లిమెంట్లు, ఇమ్యూనిటీ బూస్టర్లకోసం ఏడాది కాలంలో భారతీయులు ఏకంగా రూ.15వేల కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. కరోనా మందులతో పాటు, విటమిన్ ట్యాబ్లెట్లు, ఇమ్యూనిటీ బూస్టర్ల వ్యాపారం బీభత్సంగా కొనసాగుతోంది. 2019 సంవత్సరంలో భారత్ లో ఇమ్యూనిటీ బూస్టర్ల మార్కెట్ రూ.5వేల కోట్లు. 2020లో దీని విలువ ఏకంగా 15వేల కోట్ల రూపాయలకు చేరింది.

ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని కరోనా కాలంలో అందరికీ తెలిసొచ్చింది. దీంతో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సప్లిమెంట్లు, ఇమ్యూనిటీ బూస్టర్లకోసం భారతీయులు ఎక్కువగా ఖర్చు చేయడం మొదలు పెట్టారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆప్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెలువరించిన ఓ నివేదికలో ఈ విషయాలు బయటపడ్డాయి. పిల్లలకోసం తయారు చేసే హెల్త్ డ్రింక్ లకు ఇప్పుడిప్పుడే భారత్ పెద్ద మార్కెట్ గా మారుతోంది. అదే సమయంలో మహిళలు, వయసు పైబడుతున్న వారికి కూడా ఇమ్యూనిటీ బూస్టర్ ట్యాబ్లెట్ల వాడకం కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. శరీరంలో సహజ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మల్టీవిటమిన్, బి, సి, డి విటమిన్లను ట్రీట్ మెంట్ లో తప్పనిసరి చేస్తూ వైద్యులు సూచిండడంతో వీటి వాడకం పెరిగింది.