Begin typing your search above and press return to search.

మొబైల్స్ వాడకంపై ఆ రాష్ట్ర ప్రభుత్వోగులకు ఆదేశాలు !

By:  Tupaki Desk   |   24 July 2021 6:40 AM GMT
మొబైల్స్ వాడకంపై  ఆ రాష్ట్ర ప్రభుత్వోగులకు ఆదేశాలు !
X
ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీస్ సమయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై మహారాష్ట్ర సర్కార్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆఫీస్ టైమింగ్స్ లో ప్రభుత్వ ఉద్యోగులు సాధ్యమైనంత మేరకు మొబైల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించింది. కేవలం అత్యవసరం అనుకుంటే ల్యాండ్ లైన్ ఫోన్లను వినియోగించాలని తెలిపింది. దేశ వ్యాప్తంగా పెగాసస్ స్పై‌వేర్ దుమారం సృష్టిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌ మెంట్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

అధికారిక పనుల నిమిత్తం అత్యవసరమైతే మాత్రమే మొబైల్ ఫోన్లు వినియోగించాలని ఉద్యోగులకు సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు విచ్ఛలవిడిగా మొబైల్ ఫోన్ల వాడటం ద్వారా ప్రభుత్వ ఇమేజ్‌ దెబ్బతినే అవకాశమున్నట్లు వెల్లడించింది. అయితే, ఈ అధికారిక ఉత్తర్వుల్లో ఎక్కడా నేరుగా పెగాసస్ స్పై‌వేర్ గురించి నేరుగా మాత్రం ప్రస్తావించలేదు. మొబైల్ ఫోన్లు వినియోగించాల్సి వస్తే..ఎక్కువగా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా చేసుకోవాలని ఆ ఆదేశాల్లో సూచించింది. అలాగే పనివేళల్లో మొబైల్ ఫోన్లలో సోషల్ మీడియా వినియోగాన్ని కూడా వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది.

ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక మొబైల్ ఫోన్స్‌ లో వ్యక్తిగత కాల్స్ చేసుకోవాలని, ప్రభుత్వోగుల మొబైల్ ఫోన్ వినియోగంపై కోడ్ ఆఫ్ కండక్ట్ పేరిట జారీ చేసిన ఉత్తర్వుల్లో పొందుపరిచింది. పరిసర ప్రాంతాల్లో ఇతరులు ఉండే అవకాశమున్నందున మొబైల్ ఫోన్లలో గౌరవప్రదంగా మాట్లాడాలని , తక్కువ వాయిస్‌ తో మొబైల్ ఫోన్లలో ఇతరులతో మాట్లాడాలని సూచించింది. అదే సమయంలో ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారుల నుంచి వచ్చే కాల్స్‌ ను జాప్యం చేయకుండా తక్షణమే రిసీవ్ చేసుకోవాలని స్పష్టంచేసింది. అలాగే అధికారిక సమావేశాలు, సీనియర్ అధికారుల ఛాంబర్స్‌లో ఉండే ఛాంబర్స్‌లో మొబైల్ ఫోన్లను సైలెంట్ మోడ్‌లో ఉంచాలని ప్రభుత్యోగులకు సూచించింది. అలాగే ఇంటర్నెట్ బ్రౌసింగ్, మెసేజ్‌ లను తరచూ చెక్ చేసుకోవడం, ఇయర్‌ ఫోన్స్ వినియోగం చేయొద్దంటూ ప్రభుత్వోగులకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌ మెంట్ పంపిన ఆదేశాల్లో స్పష్టంచేసింది.