Begin typing your search above and press return to search.

పెళ్లి గురించి పార్లమెంట్ లో ఆ లేడి ఎంపీ అబద్ధం చెప్పారా?

By:  Tupaki Desk   |   11 Jun 2021 6:30 AM GMT
పెళ్లి గురించి పార్లమెంట్ లో ఆ లేడి ఎంపీ అబద్ధం చెప్పారా?
X
బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తన వివాహంపై చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. నిఖిల్ జైన్ తో తన వివాహం టర్కీష్ చట్టం ప్రకారం జరిగిందని.. ఈ వివాహం భారత్ లో చెల్లదని ఆమె చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. అసలు తమది వివాహమే కాదని.. సహజీవనం కిందకు వస్తుందని ప్రకటనలో తెలిపారు.

భారత చట్టాల ప్రకారం.. తనకు జరిగిన వివాహం ఇండియాలో చెల్లుబాటు కాదన్న నుస్రత్ జహాన్.. తన మతాంతర వివాహానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ధ్రువీకరణ ఉండాలన్నారు. ఇక నికిల్ నుంచి చాలా కాలం క్రితమే విడిపోయినా.. భారత చట్టాల ప్రకారం విడాకులు తీసుకునే ప్రశ్న తలెత్తదు అని అన్నారు.

దీనిపై బీజేపీ విమర్శలు కురిపించింది. పెళ్లి విషయంలో నుస్రత్ పార్లమెంట్ సాక్షిగా అబద్ధమాడిందని విమర్శించింది. బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. ‘నుస్రత్ జహాన్ వ్యక్తిగత జీవితం గురించి ఆమె ఎవరిని వివాహం చేసుకున్నారు? ఎవరితో కలిసి ఉంటున్నారనే దానిపై మేం మాట్లాడడం లేదని.. ప్రజలు ఎన్నుకున్న ఎంపీగా పార్లమెంట్ రికార్డుల్లో ఆమె నిఖిల్ జైన్ ను వివాహం చేసుకున్నట్టు ఉందని.. అంటే ఆమె పార్లమెంట్ సాక్షిగా అబద్దం చెప్పారా? అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు.

ఇక తన ఆభరణాలు, ఇతర వస్తువులు కూడా అక్రమంగా నిఖిల్ జైన్ కుటుంబ సభ్యులు లాగేసుకున్నారని ఆరోపించారు. తన ఆస్తుల విషయంలో తన అభిప్రాయం తీసుకోకుండా తరలించారని వెల్లడించారు.