Begin typing your search above and press return to search.

ఆ శాడిస్ట్ టీచ‌ర్ పై ​ ​ఏపీ స‌ర్కారు చ‌ర్య‌లు

By:  Tupaki Desk   |   4 Dec 2017 8:14 AM GMT
ఆ శాడిస్ట్ టీచ‌ర్ పై ​ ​ఏపీ స‌ర్కారు చ‌ర్య‌లు
X
రెండు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన శాడిస్ట్ టీచ‌ర్ భ‌ర్త ఉదంతం తెలిసిందే. పెళ్లి అయిన రోజే.. తొలిరాత్రి న‌ర‌కం చూపించ‌ట‌మే కాదు.. రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించి గుర్తించ‌టానికి వీల్లేని రీతిలో శారీర‌క హింస‌కు గురి చేసిన దుర్మార్గుడి వైనం ప‌లువురికి షాకింగ్ మారింది.

బుట్ట‌బొమ్మ‌లా చ‌క్క‌గా ఉన్న పెళ్లి కూతురు.. తొలిరాత్రి భ‌ర్త‌తో ప‌డ‌క‌గ‌దిలోకి వెళ్లి బ‌య‌ట‌కు వ‌చ్చేస‌రికి భ‌యంక‌ర‌మైన దెబ్బ‌ల‌తో.. ఏ మాత్రం గుర్తు ప‌ట్ట‌లేని రీతిలో మారిపోయిన వైనం సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఆ శాడిస్ట్ భ‌ర్త‌ను తీవ్రంగా శిక్షించాల‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా.. ఈ శాడిస్ట్ టీచ‌ర్ భ‌ర్త‌పై ఏపీ స‌ర్కారు క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఈ టీచ‌ర్‌ ను వెనువెంట‌నే ఉద్యోగం నుంచి స‌స్పెండ్ చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ కు దేశాలు జారీ చేసింది. దీంతో.. శాడిస్ట్ భ‌ర్త‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లుగా డీఈవో వెల్ల‌డించారు. చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు మండ‌లం మోత‌క‌రంగ‌న్న‌ప‌ల్లెకు చెందిన రాజేశ్.. జిల్లాకు చెందిన వి.కోట మండ‌లంలోని అదెన‌ప‌ల్లె మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్‌ గా ప‌ని చేస్తున్నారు.

అత‌డికి గంగాధ‌ర నెల్లూరు మండ‌లంలోని దామ‌ర‌కుంట‌కు చెందిన శైల‌జతో పెళ్లి జ‌ర‌గ‌టం.. తొలిరోజు రాత్రే ఆమెను దారుణంగా హింసించిన వైనం తెలిసిందే. భ‌ర్త చేతిలో హింస‌కు గురై. . తీవ్రంగా గాయ‌ప‌డిన ఆమెను తాజాగా త‌మిళ‌నాడులోని వేలూరు సీఎంసీ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు. తాజాగా ఏపీ మ‌హిళా క‌మిష‌న్ ఛైర్మ‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి శైల‌జ‌ను ప‌రామ‌ర్శించారు. ప్ర‌భుత్వ ప‌రంగా సాయం చేస్తామ‌ని.. అండ‌గా నిలుస్తామ‌న్నారు.