Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: పడిపోయిన బీర్.. విస్కీకి డిమాండ్

By:  Tupaki Desk   |   2 Aug 2020 12:30 AM GMT
కరోనా ఎఫెక్ట్: పడిపోయిన బీర్.. విస్కీకి డిమాండ్
X
కరోనా మనిషిని కంట్రోల్ లో పెట్టింది. విచ్చలవిడి తనాన్ని తగ్గించింది. పబ్ లు, బార్లు, వైన్స్ లలో ఇష్టానుసారంగా తాగడం పూర్తిగా బంద్ అయిపోయింది. ఎగబడి.. మీదపడి సాన్నిహత్యంగా మెలగడం తగ్గిపోయింది. మొత్తంగా కరోనా మహమ్మారి ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులే తీసుకొచ్చింది. లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసింది.

ఇప్పుడు మాస్కులు లేనిదే జనం బయటకు రావడం లేదు. భౌతిక దూరంతోపాటు తరుచుగా శానిటైజర్లు, హ్యాండ్ వాషులతో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు.

ఇక కరోనాకు ముందు బీర్లు తెగ తాగేవారు. కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు శీతల పదార్థాలే దూరం పెడుతున్నారు. బీరు వద్ద విస్కీయే బెటర్ అంటున్నారు.

చల్లటి బీర్లు తాగితే జలుబు, దగ్గు వస్తుందని జనాలు భయపడుతున్నారు. కరోనా లక్షణాల్లో జలుబు, దగ్గు ఉంటే ఇక వారిని కాపాడడం కష్టం. అందుకే చల్లటి బీరుతో ఆ ప్రమాదం ఉండడంతో బీర్లు మానేసి మందుబాబులంతా విస్కీనే కొంటున్నారు. హైదరాబాద్ , ఏపీ, తెలంగాణ అంతటా ఇదే ధోరణి పెరిగిపోయింది.

కరోనా లాక్ డౌన్ తర్వాత వైన్ షాపులు తెరిచినప్పటి నుంచి బీర్ల కన్నా విస్కీనే ఎక్కువగా కొంటున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నారు. ఎక్కువగా బ్లెండర్స్ ప్రైడ్ కొంటున్నారని తెలిసింది. ఆ తర్వాత సిగ్నేచర్, రాయల్ చాలెంజ్, రాయల్ స్టాగ్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.