Begin typing your search above and press return to search.

రేపు మీరు చనిపోయినా ఇలానే పడేస్తారు..బీజేపీకి భారీ పంచ్!

By:  Tupaki Desk   |   1 July 2020 11:30 AM GMT
రేపు మీరు చనిపోయినా ఇలానే పడేస్తారు..బీజేపీకి భారీ పంచ్!
X
కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో మహమ్మారి కారణంగా మరణించిన వారి మృతదేహాలను అత్యంత అనాగరికంగా అంతిమ సంస్కారాలు జరిపిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే వైరల్ గా మారింది. ప్రతి ఒక్కరు తిట్టిపోస్తున్న ఈ వైనం ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజకీయ రగడకు దారి తీసింది. మహమ్మారి కారణంగా మరణించిన వారిని గొయ్యి తీసి.. అందులో ఒకరిపైన ఒకరి మృతదేహాన్ని వేసి పూడ్చేయటం.. గుంత వరకూ తీసుకొచ్చేందుకు.. ఈడ్చుకు రావటం లాంటి తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.

ఈ ఉదంతంపై విపక్ష జేడీఎస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అధికార బీజేపీపైనా.. ఆ పార్టీ నేతల్ని కడిగిపారేసేలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ పార్టీ అధికారిక సోషల్ మీడియా లో పోస్టు చేసిన నేతలు.. బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఒకవేళ మీరు కానీ మీ కటుుంబ సభ్యులు కానీ కరోనా కారణం గా చని పోతే.. ఇలానే గొయ్యి తీసి అందు లో మృత దేహాల్ని పడేస్తారంటూ మండి పడ్డారు.

మహమ్మారిని నియంత్రించే విషయంలో తమ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్న తీరును తప్పు పట్టారు. కరోనా విషయంలో ప్రభుత్వం ప్రతి రోజూ చెప్పే అత్యంత మెరుగైన కొవిడ్ మేనేజ్ మెంట్ ఇదేనంటూ టైమ్లీగా సెటైర్లు వేసింది. ఇదిలా ఉంటే.. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటికే ఆయా అధికారులపై చర్యలు తీసుకున్నారు. విచారణకు ఆదేశించారు.అయితే.. ఇవేమీ బీజేపీ సర్కారుపై వెల్లువెత్తే నిరసనను తగ్గించలేకపోతున్నాయి.