Begin typing your search above and press return to search.

చంద్రబాబు, లోకేశ్​ పై సైబర్​క్రైమ్​ కేసు..!

By:  Tupaki Desk   |   11 April 2021 7:34 AM GMT
చంద్రబాబు, లోకేశ్​ పై సైబర్​క్రైమ్​ కేసు..!
X
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, నారా లోకేశ్​ పై విజయవాడ సైబర్​ క్రైమ్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల టీడీపీ  అధికారిక ఫేస్​బుక్​ ఖాతాలో వైసీసీ అభ్యర్థి గురుమూర్తిపై అసభ్యకర పోస్టులు పెట్టారని వైసీసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌.. డీజీపీ సవాంగ్‌ కు ఫిర్యాదు చేశారు.
సైబర్ క్రైం పోలీసులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్​ పై కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం లోకేశ్​ తిరుపతి పార్లమెంట్​ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి చంద్రబాబునాయుడు కూడా తిరుపతి పార్లమెంట్​ పరిధిలోనే ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీ  అధికారిక సోషల్​మీడియాలో తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి పై అనుచిత పోస్టులు పెట్టినట్టు సమాచారం. వెంటనే అలర్టయిన వైసీసీ నేతలు కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. లోకేశ్​ తన అధికారిక ఫేస్​బుక్​ ఖాతాలో వైసీపీ అభ్యర్థి, దళితుడైన గురుమూర్తిని అవమానించేలా పోస్టు పెట్టారని  వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించారు. లోకేశ్​ పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైసీపీ  నేతలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం లోకేశ్​ తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే తిరుపతిలో జనసేనాని పవన్​ కల్యాణ్​ సభ ముగిసిన విషయం తెలిసిందే. మరోవైపు లోకేశ్​, చంద్రబాబు నాయుడు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్​ మాత్రం కరోనా కారణంగా ప్రచారంలో పాల్గొనడం లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాను ప్రచారంలో పాల్గొనడం లేదని... ప్రజలంతా వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఇదిలా ఉంటే లోకేశ్ మాత్రం సీఎం జగన్​పై ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా వివేకా  హత్యను తెరమీదకు తీసుకొస్తున్నారు. లోకేశ్​ పై వైసీపీ  మంత్రులు, నేతలు సైతం తమదైన స్టయిల్​ లో పంచ్​ లు వేస్తున్నారు. పవన్​ పర్యటన తర్వాత బీజేపీ లో జోష్​ పెరిగినప్పటికీ .. ఆ పార్టీకీ పెద్దగా క్యాడర్​ లేకపోవడంతో ప్రచారంలో వెనకబడింది.