Begin typing your search above and press return to search.

పెరిగిపోతున్న పేడ దొంగతనాలు.. 5 మంది మహిళల నుంచి భారీగా పేడ స్వాధీనం !

By:  Tupaki Desk   |   3 March 2021 2:30 AM GMT
పెరిగిపోతున్న పేడ దొంగతనాలు.. 5 మంది మహిళల నుంచి భారీగా పేడ స్వాధీనం !
X
ఎక్కడైనా బంగారం , డైమెండ్స్ దొంగతనాల గురించి విన్నాం కానీ పేడ ఈ దొంగతనాలేంటని ఆశ్చర్యంగా ఉంది కదా. ఆశ్చర్య కరంగా అయినా ఇది నిజం. పేడను దొంగతనం చేస్తూ దొరికిన ఐదుగురు మహిళల నుంచి పోలీసులు ఏకంగా 45 కేజీల పేడను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2020లో గౌ-దాన్ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా కిలో ఆవు పేడను రెండు రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది.

ప్రభుత్వ ప్రకటన తర్వాత పేడకు ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది. పేడకు డిమాండ్ పెరగడంతో దొంగతనాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి. దీంతో పేడను కాపాడుకోవడానికి ఎవరికివారు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా, అంబికాపూర్ మునిసిపాలిటీలో ప్రభుత్వ గౌ-దాన్ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగిలిస్తూ ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు. వారి నుంచి 45 కేజీల పేడను స్వాధీనం చేసుకున్నారు. పెరిగిపోతున్న పేడ దొంగతనాలను అరికట్టేందుకు గౌ-దాన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు రెడీ అవుతున్నారు. అంతేకాదు, పేడను కాపాడేందుకు అక్కడ కాపలా కూడా పెట్టాలని నిర్ణయించారు.

ఇలా ఆవుపేడ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో గోదాన్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గోదాన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అలాగే భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారు.