Begin typing your search above and press return to search.

కరోనా సోకితే మెదడుకు కూడా దెబ్బే..సర్వేలో షాకింగ్​ నిజాలు..!

By:  Tupaki Desk   |   3 Jan 2021 11:30 PM GMT
కరోనా సోకితే  మెదడుకు కూడా దెబ్బే..సర్వేలో షాకింగ్​ నిజాలు..!
X
కరోనా వైరస్​ ప్రపంచం మొత్తాన్ని కుదిపివేసింది. ఈ వైరస్​ మానవశరీరభాగాలపై ఏ విధంగా ప్రభావం చూపుతున్నదన్న విషయంపై ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తల పరిశోధనల్లో పలు షాకింగ్​ నిజాలు బయటపడుతున్నాయి. కరోనా వైరస్​ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని.. శ్వాస ఇబ్బందులతో రోగులు చనిపోతున్నారన్నది తెలిసిన విషయమే.అయితే కరోనా శరీరంలోని రక్తనాళాలు, మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనల్లో బయటపడింది.

కరోనాతో చనిపోయిన వారిపై ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అయితే ఈ సందర్బంగా వాళ్లు పలు విషయాలను గుర్తించారు. కరోనా వైరస్​ అనేకమంది మెదడుపై కూడా ప్రభావం చూపించినట్టు ఈ పరిశోధన తేల్చింది. ఇటీవల నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధన చేశారు. మార్చి నుంచి జూలై 2020 మధ్య కరోనాతో మరణించిన వారి శరీర కణజాలాలపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను న్యూ ఇంగ్లాండ్​ జర్నల్​ ఆఫ్​ మెడిసిన్​లో ప్రచురించారు. ఈ పరిశోధనలో షాకింగ్​ నిజాలు బయటపడ్డాయి.

కరోనాతో చనిపోయిన వారి మెదడులో మైక్రోవాస్కులర్ రక్తనాళాల దెబ్బతిన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. అయితే మెదడు కణజాలాల్లో కరోనా వైరస్​ ఆనవాళ్లను వాళ్లు గుర్తించలేదు. కానీ కరోనా సోకినవారికి మెదడుపై ప్రభావం చూపించనట్టు మాత్రం తేలింది. అయితే ఈ విషయంపై ఇంకా పరిశోధన సాగాల్సి ఉన్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వైరస్​ సోకినవారికి సంబంధించిన ఎంఆర్​ఐ స్కానింగ్​ల ఆధారంగా వాళ్లు ఈ పరిశోధన కొనసాగించారు. ఇప్పటికే రక్తంపై కూడా కరోనా వైరస్​ ప్రభావాన్ని చూపిస్తుందని తేలింది. తాజాగా మెదడు నరాలు, కణాజాలాలపై కూడా కరోనా వైరస్​ ప్రభావం చూపిందని తేలింది.