Begin typing your search above and press return to search.

బాలీవుడ్ న‌టికి కోర్టు షాక్.. 3 ఫ్లాట్లు జ‌ప్తు!

By:  Tupaki Desk   |   27 April 2018 4:25 AM GMT
బాలీవుడ్ న‌టికి కోర్టు షాక్.. 3 ఫ్లాట్లు జ‌ప్తు!
X
వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన న‌టి మ‌మ‌తా కుల్ క‌ర్ణి. బాలీవుడ్‌ తో పాటు.. టాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేసిన ఆమె.. కొంత‌కాలంగా చ‌ట్టానికి చిక్కుండా త‌ప్పించుకు తిరుగుతున్నారు. రూ.2వేల కోట్ల విలువైన మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. 2016లో ఠాణె పోలీసులు న‌మోదు చేసిన ఈ కేసు విచార‌ణ‌కు ఆమె హాజ‌రు కావ‌టం లేదు.

ప్ర‌స్తుతం కెన్యాలో ఉంటున్న‌ట్లు చెప్పే మ‌మ‌తా కుల్ క‌ర్ణి ఇండియాకు రాక‌పోవ‌టం.. కోర్టు విచార‌ణ‌కు డుమ్మా కొడుతున్న నేప‌థ్యంలో మాద‌క ద్ర‌వ్యాల కేసును విచారించే ఎన్ డీపీఎస్ ప్ర‌త్యేక కోర్టు భారీ షాకిచ్చింది. ముంబ‌యిలోని ఆమెకు చెందిన మూడు ఫ్లాట్ల‌ను జ‌ఫ్తు చేసుకునేలా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. వీటి విలువ సుమారు రూ.20 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని చెబుతున్నారు.

డ్ర‌గ్స్ స్మ‌గ్ల‌ర్ వికీ గోస్వామితో క‌లిసి ప్ర‌స్తుతం మ‌మ‌తా కెన్యాలో ఉంటున్నారు. వీరిద్ద‌రిని భార‌త‌దేశానికి ర‌ప్పించ‌టానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌రారీ స్టేట‌స్ లో ఉన్న వీరిద్ద‌రిని కోర్టుకు హాజ‌ర‌య్యేలా చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో మ‌మ‌తాకు చెందిన మూడు ఫ్లాట్ల‌ను అధికారులు జ‌ప్తు చేసి స్వాధీనం చేసుకోవాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.