Begin typing your search above and press return to search.

కరోనా అనుమానంతో దంపతుల ఆత్మహత్య.. అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు?

By:  Tupaki Desk   |   27 March 2020 2:00 PM GMT
కరోనా అనుమానంతో దంపతుల ఆత్మహత్య.. అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు?
X
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా కరోనా వైరస్ పై మాత్రం ప్రజల్లో రోజురోజుకు భయం పెరిగిపోతోంది. లాక్ డౌన్ తరువాత కూడా కరోనా కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతుండటం తో అందరిలో ఒకరకమైన ఆ భద్రతా భావం మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణ విషాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు.

ఇంటికి సమీపంలోని తుప్పల్లో కాలిపోయి భార్యభర్తల మృత దేహాలు ఉండటం కలకలం రేగింది. రాజమండ్రి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ గా పని చేసే రమేష్, వెంకట లక్ష్మి దంపతులు సగం కాలిన దేహాలతో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనితో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు . సంఘటనా స్థలం లో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. . అయితే.. కరోనా వచ్చిందన్న అనుమానంతోనే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని సూసైడ్ నోట్‌లో రాసి ఉండటాన్ని బట్టి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు

ఇక స్థానికుల కథనం ప్రకారం వారికి చాలా కాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని , వారు ఏ కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలీదని అంటున్నారు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన ఒక బ్యాగ్ లో వారికి సంబంధించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్లు దొరికాయి. అలాగే సూసైడ్ నోట్ కూడా దొరికింది. వీరిని చంపేసి, కిరోసిన్ పోసి కాల్చేసి.. సూసైడ్ నోట్ రాసిపెట్టారా? లేక వాళ్లే ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణాల్లో విచారణ ప్రారంభించారు.