Begin typing your search above and press return to search.

వైజాగ్ ఎయిర్ పోర్టు కి తాకిన కరోనా సెగ !

By:  Tupaki Desk   |   28 Jan 2020 9:50 AM GMT
వైజాగ్ ఎయిర్ పోర్టు కి తాకిన కరోనా సెగ !
X
ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తోంది. ఇక ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, విశాఖపట్నం విమానాశ్రయం లో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే ప్రయాణికులు, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారిని పరిశీలించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.

కరోనా వైరస్ ఇప్పటికే సోకిన దేశాల నుంచి వచ్చే వారికి ఇక్కడ ప్రత్యేక పరీక్షలు ఉంటాయని అధికారులు చెప్పారు. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల దగ్గర ప్రయాణికుల అవగాహన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. చైనా, దుబాయ్, మలేషియా, సింగపూర్ నుంచి నగరానికి వస్తున్న వారిని పూర్తిగా పరిశీలిస్తున్నామని, వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకుంటేనే నగరం లోకి పంపుతునట్లు స్పష్టం చేశారు అధికారులు.