Begin typing your search above and press return to search.

అక్కడ కరోనా వైరస్ తో 200మంది సైనికులు మృతి

By:  Tupaki Desk   |   12 March 2020 12:00 AM IST
అక్కడ కరోనా వైరస్ తో 200మంది సైనికులు మృతి
X
చైనాలో పుట్టిన కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దాని చుట్టుపక్కల దేశాలకు విస్తరించి మరణ మృదంగం వాయిస్తోంది. రోజురోజుకు విస్తరిస్తూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది.

చైనాలో తీసుకున్న పటిష్టమైన చర్యలతో ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య తగ్గిపోయింది. కొత్త కేసులు, మరణాలు వెలుగుచూడడం లేదు. అయితే యూరప్ సహా చైనా పక్కనున్న దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.

చైనా తర్వాత కరోనా వైరస్ ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా దేశాల్లో ప్రభావం బాగా ఉంది. చాలా మంది ఈ దేశాల్లో చనిపోయారు. అయితే ఒక వ్యక్తికి కరోనా సోకిందని ఉత్తర కొరియాలో అతడిని కాల్చిచంపారని వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ కరోనా వైరస్ కారణంగా 200 మంది ఉత్తరకొరియా సైనికులు చనిపోయారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. దక్షిణ కొరియా వార్త సంస్థ తెలిపిన ఈ వివరాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఆ డైలీ కథనం ప్రకారం చైనాను ఆనుకొని ఉండే ఉత్తర కొరియాలోనూ ఈ వైరస్ విజృంభించింది. జనవరి , ఫిబ్రవరి నెలల్లో 200 మందికి పైగా సైనికులు చనిపోయారు. మరో 3700మందిని దిగ్బంధించి చికిత్స కేంద్రాలకు తరలించారట.. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులే ఈ కరోనా బారిన పడ్డారని ఫిబ్రవరి వరకే 200 మంది సైనికులు చనిపోయారని వార్త పత్రిక తెలిపింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తొక్కేశాడని పత్రిక పేర్కొంది.