Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలో కరోనా కల్లోలం ..ఆ ఎమ్మెల్యేకి పాజిటివ్

By:  Tupaki Desk   |   2 Dec 2020 2:23 PM IST
ఏపీ అసెంబ్లీలో కరోనా కల్లోలం ..ఆ ఎమ్మెల్యేకి పాజిటివ్
X
ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. గత మూడు రోజులుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు హాజరైన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావుకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. దీంతో కారుమూరితో రెండు రోజులుగా కలిసి ఉన్న ఓ ఎమ్మెల్యేకు టెన్షన్ మొదలైంది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లి కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు.

డాక్టర్లు కారుమూరి నాగేశ్వర్ రావు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారించారు. కాగా, కారుమురి నాగేశ్వర్ రావు మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. సభలో ప్రసంగించారు కూడా. దీంతో గత రెండు రోజులుగా కారుమురిని కలిసి ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. అయితే పాజిటివ్ రావడంతోనే ఈ రోజు అసెంబ్లీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయం ఏపీ అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు ఈ రోజు అసెంబ్లీకీ గైర్హజరు అయ్యారు.