Begin typing your search above and press return to search.
ప్రతీ 1000 మందిలో 500 మందికి పాజిటివ్ వచ్చే అవకాశం ..ఎక్కడంటే ?
By: Tupaki Desk | 8 May 2020 6:00 AM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉండిపోయాయి. కాగా, ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా బారిన పడే దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ముందుండే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో దేశ జనాభాలో దాదాపు 80 శాతం కరోనా బారిన పడే ప్రమాద చెందుతోంది. మొత్తం 3.5 కోట్ల జనాభా కలిగిన ఆఫ్ఘనిస్థాన్ లో సుమారు 50 లక్షలకుపైగా జనాభా దేశ రాజధాని కాబూల్లోనే ఉంది.
పూర్తి వివరాలు చూస్తే... కాబూల్ లో ఇఫ్పటికే 500మందికి ర్యాండమ్ టెస్ట్ నిర్వహించగా, 50 శాతం మంది కరోనా కు గురైనట్టు తేలిందని ఐవోఎం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ లో కరోనా పరీక్షలకు ఏర్పాటైన కేంద్రాలు 8 మాత్రమే. వీటిలో రోజుకు 100 నుంచి 150 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించే వీలున్నది. ఉగ్రవాదుల ప్రభావం వల్ల ఆఫ్ఘన్ లోని 30 శాతం ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకే అవకాశం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 50 ఏళ్ళు మాత్రమే.
ఆఫ్ఘన్ లో నిరంతర అంతర్యుద్ధాల వల్ల ఇప్పటికే లక్షలాదిమంది పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల శరణార్థుల్ని తమ సొంత దేశాలకు పంపించడంపై అంతర్జాతీయంగా ఆంక్షలున్నాయి. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికే ఇరాన్, పాకిస్థాన్ ల నుంచి 2,71,000మంది ఆఫ్ఘన్ కు చేరుకున్నారు. వీరి ద్వారా కరోనా వాపిస్తుందన్న ఆందోళన కూడా ఆ దేశ అధికారుల్లో నెలకొన్నది.
పూర్తి వివరాలు చూస్తే... కాబూల్ లో ఇఫ్పటికే 500మందికి ర్యాండమ్ టెస్ట్ నిర్వహించగా, 50 శాతం మంది కరోనా కు గురైనట్టు తేలిందని ఐవోఎం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ లో కరోనా పరీక్షలకు ఏర్పాటైన కేంద్రాలు 8 మాత్రమే. వీటిలో రోజుకు 100 నుంచి 150 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించే వీలున్నది. ఉగ్రవాదుల ప్రభావం వల్ల ఆఫ్ఘన్ లోని 30 శాతం ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకే అవకాశం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 50 ఏళ్ళు మాత్రమే.
ఆఫ్ఘన్ లో నిరంతర అంతర్యుద్ధాల వల్ల ఇప్పటికే లక్షలాదిమంది పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల శరణార్థుల్ని తమ సొంత దేశాలకు పంపించడంపై అంతర్జాతీయంగా ఆంక్షలున్నాయి. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికే ఇరాన్, పాకిస్థాన్ ల నుంచి 2,71,000మంది ఆఫ్ఘన్ కు చేరుకున్నారు. వీరి ద్వారా కరోనా వాపిస్తుందన్న ఆందోళన కూడా ఆ దేశ అధికారుల్లో నెలకొన్నది.
