Begin typing your search above and press return to search.
పిల్లలపై కరోనా విజృంభణ ..ఒక్కరోజే అంతమంది చిన్నారులకి పాజిటివ్ !
By: Tupaki Desk | 12 Aug 2021 10:21 AM ISTకరోనా వైరస్..కరోనా వైరస్..గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ వచ్చే సూచనలున్నట్లు పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందన్న వార్తలు సైతం వెలువడ్డాయి. అయితే, ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా భయాందోళన నెలకొంది. గత ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా బారిన పడినవారంతా 19 ఏళ్లలోపు వారేనని వెల్లడించారు.
కరోనా వైరస్ బారిన పడిన వారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్ల వయసువారు 136 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరు మహానగర పాలకమండలి (బీబీఎంపీ) డేటా వివరాలను వెల్లడించింది. కరోనా థర్డ్ వేవ్ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో బెంగళూరులో పెద్ద సంఖ్యలో చిన్నారులు మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణుల సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిన్నారులను ఇళ్లల్లనే ఉంచాలని, బయటకు తీసుకురావొద్దంటూ తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.కాగా, కర్ణాటక రాష్ట్రంలో బుధవారం 1,826 కరోనా కేసులు నమోదు కాగా, 33 మంది మరణించారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 29,22,875 కి చేరగా, మరణాల సంఖ్య 36,881కి పెరిగింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 28,63,117 కి పెరిగింది.
కరోనా చెలరేగిపోతోంది. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు టీకాలు వేసుకున్నా వదలడం లేదు. కేరళలో వ్యాక్సిన్ వేయించుకున్న 40 వేల మందికిపైగా వ్యక్తులకు కరోనా సోకడం అధికారులను కలవరపరుస్తోంది. నిజానికి టీకా వేయించుకున్న తర్వాత కొవిడ్ సోకడం చాలా అరుదు. అలాంటిది ఏకంగా 40 వేల మందికిపైగా వైరస్ సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, వ్యాక్సిన్ ద్వారా అభివృద్ధి చెందే రోగ నిరోధకశక్తి నుంచి వైరస్ ఎలా తప్పించుకుంటోందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తాజా కేసులతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం జన్యు క్రమాన్ని కనుగొనేందుకు నమూనాలు పంపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని కోరింది. ఫలితంగా ఈ కేసులకేమైనా వైరస్ జన్యుమార్పిడి కారణమా, అన్ని విషయాన్ని కనుగొననుంది.
కొత్త వేరియంట్లు కొత్త వేవ్ లకు కారణమవుతుంటాయి. అలా దేశంలో ఇటీవల పెద్ద ఎత్తున విరుచుకుపడిన సెకండ్ వేవ్ కు డెల్టా వేరియంటే కారణమన్న సంగతి తెలిసిందే. అయితే, సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గినప్పటికీ కొత్త వేరియంట్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక, వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా బారినపడిన కేసుల్లో అత్యధిక శాతం పతనంథిట్ట జిల్లాలోనే నమోదయ్యాయి. వీరిలో రెండు డోసులు తీసుకున్నవారూ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తొలి డోసు తీసుకున్న వారిలో 14,974 మంది వైరస్ బారినపడగా, రెండు డోసులు తీసుకున్న వారు 5,042 మంది ఉన్నారు. కాగా, కేరళలో గత కొన్ని వారాలుగా రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
కరోనా వైరస్ బారిన పడిన వారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్ల వయసువారు 136 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరు మహానగర పాలకమండలి (బీబీఎంపీ) డేటా వివరాలను వెల్లడించింది. కరోనా థర్డ్ వేవ్ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో బెంగళూరులో పెద్ద సంఖ్యలో చిన్నారులు మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణుల సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిన్నారులను ఇళ్లల్లనే ఉంచాలని, బయటకు తీసుకురావొద్దంటూ తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.కాగా, కర్ణాటక రాష్ట్రంలో బుధవారం 1,826 కరోనా కేసులు నమోదు కాగా, 33 మంది మరణించారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 29,22,875 కి చేరగా, మరణాల సంఖ్య 36,881కి పెరిగింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 28,63,117 కి పెరిగింది.
కరోనా చెలరేగిపోతోంది. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు టీకాలు వేసుకున్నా వదలడం లేదు. కేరళలో వ్యాక్సిన్ వేయించుకున్న 40 వేల మందికిపైగా వ్యక్తులకు కరోనా సోకడం అధికారులను కలవరపరుస్తోంది. నిజానికి టీకా వేయించుకున్న తర్వాత కొవిడ్ సోకడం చాలా అరుదు. అలాంటిది ఏకంగా 40 వేల మందికిపైగా వైరస్ సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, వ్యాక్సిన్ ద్వారా అభివృద్ధి చెందే రోగ నిరోధకశక్తి నుంచి వైరస్ ఎలా తప్పించుకుంటోందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తాజా కేసులతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం జన్యు క్రమాన్ని కనుగొనేందుకు నమూనాలు పంపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని కోరింది. ఫలితంగా ఈ కేసులకేమైనా వైరస్ జన్యుమార్పిడి కారణమా, అన్ని విషయాన్ని కనుగొననుంది.
కొత్త వేరియంట్లు కొత్త వేవ్ లకు కారణమవుతుంటాయి. అలా దేశంలో ఇటీవల పెద్ద ఎత్తున విరుచుకుపడిన సెకండ్ వేవ్ కు డెల్టా వేరియంటే కారణమన్న సంగతి తెలిసిందే. అయితే, సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గినప్పటికీ కొత్త వేరియంట్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక, వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా బారినపడిన కేసుల్లో అత్యధిక శాతం పతనంథిట్ట జిల్లాలోనే నమోదయ్యాయి. వీరిలో రెండు డోసులు తీసుకున్నవారూ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తొలి డోసు తీసుకున్న వారిలో 14,974 మంది వైరస్ బారినపడగా, రెండు డోసులు తీసుకున్న వారు 5,042 మంది ఉన్నారు. కాగా, కేరళలో గత కొన్ని వారాలుగా రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
