Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : ఇంటివద్దకే జగనన్న గోరుముద్ద !

By:  Tupaki Desk   |   24 March 2020 9:00 PM IST
కరోనా ఎఫెక్ట్ : ఇంటివద్దకే  జగనన్న గోరుముద్ద !
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ...ప్రభుత్వ స్కూల్ విద్యార్ధులకి శుభవార్త చెప్పింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని పరిస్థితులు చక్కబడేవరకు ..ఇళ్లవద్దే జగనన్న గోరుముద్ద కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ..మార్చి 31 వరకు పాఠశాలల కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ తరువాత దేశ వ్యాప్తంగా కరోనా మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ... రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేసారు. దీనితో ఇంటి వద్ద ఉన్న విద్యార్థులు మధ్యాహ్నం భోజనానికి ఇబ్బందిపడతారని భావించిన జ‌గ‌న్ స‌ర్కార్ ఇంటి దగ్గరికే గోరుముద్దను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.. ఇక మధ్యాహ్నం భోజనం అందించేందుకు చర్యలు చేపట్టారు. మెనూ ప్రకారం బియ్యం, చిక్కీ, కోడిగుడ్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ల ద్వారా 31వరకు వరకూ విద్యార్థులకు ఇళ్ల వద్దకే పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై విద్యార్థులు, త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

జగనన్న గోరుముద్ద మెనూ :

సోమవారం: అన్నం, పప్పుచారు, కోడి గుడ్డు కూర, చిక్కీ

మంగళవారం: పులిహోర, టమాట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు

బుధవారం: వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ

గురువారం: కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు

శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ

శనివారం: అన్నం, సాంబార్, తీపి పొంగలి.