Begin typing your search above and press return to search.
కరోనా ఆఫ్టర్: ప్రపంచానికి మరో రెండు విపత్తులు
By: Tupaki Desk | 14 Feb 2021 9:00 PM ISTమైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఐదేళ్ల క్రితమే అంటు వైరస్ ల (కరోనావైరస్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఖచ్చితంగా ముందే ఊహించాడు. మహమ్మారి వ్యాప్తిపై గేట్స్ మాటలు తాజాగా నిజమయ్యాయి. తాజాగా బిల్ గేట్స్ మరో బాంబు పేల్చారు. ప్రపంచవ్యాప్తంగా మరో రెండు సంక్షోభాలు రానున్నాయని.. బిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతారని.. మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయగల రెండు పెద్ద సంక్షోభాలు వస్తాయని ఆయన మరోసారి హెచ్చరించారు.
2015 లోనే బిల్ గేట్స్ కరోనావైరస్ ను ఊహించాడు. "రాబోయే కొద్ది దశాబ్దాల్లో 10 మిలియన్ల మందిని చనిపోవచ్చని.. ఇది యుద్ధానికి బదులుగా అత్యంత అంటు వైరస్ కావచ్చు అని చెప్పాడు. తాజాగా నిన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్తో ఒక వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ‘వాతావరణ మార్పు’తోపాటు ‘బయో టెర్రరిజం’ రాబోయే రెండు ప్రముఖ విపత్తులని.. ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు.
"ప్రతి సంవత్సరం వాతావరణలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. దీనివల్ల మనకు కలిగిన మరణాల సంఖ్య చాలా ఎక్కువ" అని గేట్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. “అలాగే, మహమ్మారికి సంబంధించినది ప్రజలు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని విషయం, ఇది బయోటెర్రరిజం, నష్టాన్ని కలిగించాలనుకునే ఎవరైనా ఇలాంటి కొత్త వైరస్ ను సృష్టించవచ్చు. అందువల్ల ప్రస్తుతానికి సహజంగా సంభవించే అంటువ్యాధుల కంటే కృత్రిమంగా తయారు చేసిన వాటితోనే ప్రమాదం ఎక్కువ ”అని ఆయన అన్నారు.
భవిష్యత్తులో ప్రపంచం మరెన్నో మహమ్మారిలను ఎదుర్కోవాలని.. అయితే కరోనావైరస్ వ్యాప్తితో ఈ రోజు సంభవించే మరణాల సంఖ్యను మించి మానవులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి గురించి బిల్ గేట్స్ మాట్లాడారు. “శ్వాసకోశ వ్యాధులు చాలా భయానకంగా ఉన్నాయి, ఎందుకంటే మీరు విమానంలో, బస్సులో తిరుగుతున్నప్పుడు ఈ అంటువ్యాధులు. వైరల్ లోడ్ ఇతర వ్యక్తులకు సోకుతాయి. మీరు ఆసుపత్రి మంచంలో ఉండేసరికి వారికి వ్యాధి మొదలవుతుందని చెప్పుకొచ్చారు.
2015 లోనే బిల్ గేట్స్ కరోనావైరస్ ను ఊహించాడు. "రాబోయే కొద్ది దశాబ్దాల్లో 10 మిలియన్ల మందిని చనిపోవచ్చని.. ఇది యుద్ధానికి బదులుగా అత్యంత అంటు వైరస్ కావచ్చు అని చెప్పాడు. తాజాగా నిన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్తో ఒక వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ‘వాతావరణ మార్పు’తోపాటు ‘బయో టెర్రరిజం’ రాబోయే రెండు ప్రముఖ విపత్తులని.. ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు.
"ప్రతి సంవత్సరం వాతావరణలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. దీనివల్ల మనకు కలిగిన మరణాల సంఖ్య చాలా ఎక్కువ" అని గేట్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. “అలాగే, మహమ్మారికి సంబంధించినది ప్రజలు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని విషయం, ఇది బయోటెర్రరిజం, నష్టాన్ని కలిగించాలనుకునే ఎవరైనా ఇలాంటి కొత్త వైరస్ ను సృష్టించవచ్చు. అందువల్ల ప్రస్తుతానికి సహజంగా సంభవించే అంటువ్యాధుల కంటే కృత్రిమంగా తయారు చేసిన వాటితోనే ప్రమాదం ఎక్కువ ”అని ఆయన అన్నారు.
భవిష్యత్తులో ప్రపంచం మరెన్నో మహమ్మారిలను ఎదుర్కోవాలని.. అయితే కరోనావైరస్ వ్యాప్తితో ఈ రోజు సంభవించే మరణాల సంఖ్యను మించి మానవులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి గురించి బిల్ గేట్స్ మాట్లాడారు. “శ్వాసకోశ వ్యాధులు చాలా భయానకంగా ఉన్నాయి, ఎందుకంటే మీరు విమానంలో, బస్సులో తిరుగుతున్నప్పుడు ఈ అంటువ్యాధులు. వైరల్ లోడ్ ఇతర వ్యక్తులకు సోకుతాయి. మీరు ఆసుపత్రి మంచంలో ఉండేసరికి వారికి వ్యాధి మొదలవుతుందని చెప్పుకొచ్చారు.
