Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం...ట్రాన్స్ ‌జెండర్లకు రైస్ కార్డులు !

By:  Tupaki Desk   |   16 Sep 2020 12:10 PM GMT
జగన్  సర్కార్ కీలక నిర్ణయం...ట్రాన్స్ ‌జెండర్లకు రైస్ కార్డులు !
X
సమాజంలో వివక్షకు గురవుతూ , జీవితాంతం ఒంటరిగా జీవించే ట్రాన్స్‌ జెండర్ల కోసం జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండెర్లకి రైస్ కార్డులు మంజూరు చేసి అండగా నిలవాలని భావిస్తోంది. అలాగే , ఈ విషయంలో ముందడుగు వేసిన అధికారులు.. ట్రాన్స్ ‌జెండర్లను గుర్తించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. ఇప్పటికే అనాథలు, ట్రాన్స్‌ జెండర్లు, పిల్లలు లేని వితంతువులు, ఇల్లులేని వారిని గుర్తించాలని అధికారులు వాలంటీర్ల ఆదేశాలు జారీచేశారు.

గుర్తించిన వారు గ్రామ / వార్డు సచివాలయాల్లో రైస్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ రైస్‌ కార్డు మాదిరిగానే ఆరు అంశాల ప్రాతిపదికన అర్హత ఉంటే సరిపోతుంది. 10 రోజుల్లో కొత్త రైస్ కార్డును అందజేస్తారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో 5 వేల మంది కొత్తగా రైస్‌ కార్డు పొందే అవకాశం ఉంది. ఇక రైస్ కార్డులు తీసుకున్నవారు అన్ని సంక్షేమ పథకాలకు అర్హులు అవ్వనున్నారు. వీటికి సాధారణ కార్డులాగానే ఆరు అంశాల ప్రాతిపదికన తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక కార్డు పొందిన వారు సంక్షేమ పథకాలకు అర్హులని వెల్లడించారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ట్రాన్స్ ‌జెండర్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. తమ కోసం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవడం సంతోషమని వారు అంటున్నారు.