Begin typing your search above and press return to search.

బళ్లారిలో మరీ ఇంత దారుణమా? తెలిసినంతనే షాక్ తినాల్సిందే

By:  Tupaki Desk   |   1 July 2020 6:00 AM GMT
బళ్లారిలో మరీ ఇంత దారుణమా? తెలిసినంతనే షాక్ తినాల్సిందే
X
మనిషిలోని మానవత్వం అంతకంతకూ తగ్గిపోతుందా? మరణించిన వాడికి మర్యాద అన్నది లేని రీతిలో అంతిమ సంస్కారాలు జరుగుతున్న తీరు తెలిసినంతనే ఒళ్లు జలదరించాల్సిందే. ఇలాంటి బాధ్యతారాహిత్యానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నది ఒక ప్రశ్న.

కొద్దిపాటి మరణాలకే ఇలా ఉంటే.. రేపొద్దున మరింత పెరిగితే పరిస్థితి ఏమిటన్న ఆలోచనే మనిషిని కదిలించి వేయకమానదు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఉదంతానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారి.. అక్కడి అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సోమవారం ఒక్కరోజులో పన్నెండుకు మంది మరణించటం.. వారికి అంతిమ సంస్కారాల్ని నిర్వహించే క్రమంలో సిబ్బంది అనుసరించిన వైనం షాకింగ్ గా మారింది. అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సిబ్బంది.. నల్లటి సంచుల్లో కట్టి ఈడ్చుకు వెళ్లటం.. అక్కడ తీసిన గుంతల్లోకి విసిరిన వైనం ఆవేదనను కలిగిస్తాయి.అంతే కాదు.. ఒకే గుంత లో నాలుగు డెడ్ బాడీస్ ను పూడ్చి పెట్టిన వైనం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

సోషల్ మీడియా లో వైరల్ అయిన ఈ ఫోటోలు ఉన్నతాధికారుల వరకూ వెళ్లాయి. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ ఉదంతం పై విచారణ కు ఆదేశించారు. ఏమైనా.. ఇలాంటి ఉదంతాలుమానవత్వానికి మాయని మచ్చలా మారటమే కాదు.. సాటి మనిషిని మర్యాదపూర్వకంగా సాగనంపలేని దరిద్రపుగొట్టు ప్రపంచంలో బతుకుతున్నామన్న బాధ కలుగక మానదు.