Begin typing your search above and press return to search.

అమెరికాలాంటి ఘ‌ట‌నే చైనాలో: త‌ల్లీబిడ్డ‌పై పోలీసుల దాడి

By:  Tupaki Desk   |   12 Jun 2020 5:30 PM GMT
అమెరికాలాంటి ఘ‌ట‌నే చైనాలో: త‌ల్లీబిడ్డ‌పై పోలీసుల దాడి
X
అమెరికాలో న‌ల్ల జాతీయుడిని ఓ పోలీస్ కాళ్ల‌తో నొక్కి గొంతు పిసక‌డంతో అత‌డు అస్వ‌స్థ‌త‌కు గురై చివ‌ర‌కు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌పై అమెరికాలో ఎంత‌లా ఉద్య‌మం ఎగుస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆ ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే ఇప్పుడు చైనాలో దారుణం జ‌రిగింది. పోలీసులు త‌ల్లీబిడ్డ‌ను తీవ్రంగా దాడి చేశారు. సేమ్ అమెరికాలో జార్జ్ ప్లాయిడ్‌ను చేసిన‌ట్లు చైనాలో పోలీసులు ప్ర‌వ‌ర్తించారు. కారు ఎక్కబోతున్న ఓ తల్లీ.. ఆమె ఎత్తుకున్న పసిబిడ్డపై నడిరోడ్డుపై చైనా పోలీసులు దాష్టీకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ తల్లి తన బిడ్డను ఎత్తుకుని కారు ఎక్కబోతున్న సమయంలో ఇద్దరు పోలీసులు వచ్చారు. ఈ క్ర‌మంలో పోలీసులతో ఆమె వాగ్వాదం ప‌డింది. దీంతో పోలీసులు ఆమెను నడి రోడ్డు మీద పడేశారు. బిడ్డ పక్కనే పడిపోయినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఆమెను నానా దుర్భాషలాడుతూ ఇష్టమొచ్చినట్లుగా తిట్టారు. దారుణంగా ప్రవర్తించారు. ఆమెపై ఆ ఇద్దరు పురుష పోలీసులు కూర్చుని మోకాళ్లతో తొక్కిపెట్టారు. పక్కనే పడిపోయిన పసిబిడ్డ ఏడుస్తుంటే అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి ఎత్తుకున్నారు. ఆ మహిళపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగింది.. ఇప్పుడు కాదు. 2017లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంద‌రూ ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై మండిప‌డుతున్నారు.