Begin typing your search above and press return to search.

కరోనా ఖతం: ప్రపంచానికి చైనా గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   2 April 2021 8:00 AM IST
కరోనా ఖతం: ప్రపంచానికి చైనా గుడ్ న్యూస్
X
ఏడాదికి పైగా ప్రపంచ దేశాల ప్రజలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు యూరప్ లోని కొన్ని దేశాలో మూడో లాక్ డౌన్ విధిస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్ దేశంలో లాక్ డౌన్ ప్రకటన చేశారు. కరోనా వ్యాక్సిన్ రావడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలకు ఇప్పుడు చైనా మరో గుడ్ న్యూస్ చెప్పింది.

కోవిడ్19 వైరస్ ను నిర్వీర్యం చేసే కొత్త పరికరాన్ని చైనా కనిపెట్టింది. కరోనా వైరస్ ను క్రియారహితంగా చేయగలిగే ఒక పరికరాన్ని చైనా శాస్త్రవేత్తలు కనిపెట్టారు.ఎలక్ట్రాన్ బీమ్ ఇర్రేడియేషన్ (వికిరణం) అనే ప్రక్రియ ద్వారా కరోనా వైరస్ ను క్రియా రహితంగా చేయవచ్చని వారు నిరూపించారు. ఆ పరికరాన్ని చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ బాగా పనిచేస్తోందంటున్నారు.

చైనా జనరల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, తిృంగువా యూనివర్సిటీ, చైనాస్ క్లినికల్ రీసెర్చ్ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టులో పాల్గొన్నాయి. కరోనా వైరస్ ను చచ్చుబడేలా చేసి ఇన్ యాక్టివ్ గా ఈ పరికరం మారుస్తుంది. దీంతో వైరస్ మనిషికి హానిచేయకుండా అయ్యి రోగాల బారిన పడరు.