Begin typing your search above and press return to search.
లోకేశ్ మంత్రి ఎలా? సూటిప్రశ్నతో షాకిచ్చారు
By: Tupaki Desk | 19 May 2018 4:30 AM GMTఊహించని రీతిలో.. కలలో కూడా కనని వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. స్వామివారికి నిత్యం సేవ చేసుకుంటూ.. పూజలతో.. అధ్యాత్మిక కార్యక్రమాలతో కాలాన్ని గడివేసే తెలంగాణ ఆర్చక సమాఖ్యరాష్ట్ర అధ్యక్షుడు.. చిలుకూరు బాలాజీ ఆలయ ఆర్చకులు రంగరాజన్ వేసిన ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. రాజకీయంగా కలకలాన్ని రేపుతోంది.
నిత్యం నీతులు చెప్పే చంద్రబాబు చేసే పనులు.. తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటివేళ.. బాబు నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేస్తున్న రంగరాజన్ సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్కు ఏ అర్హత ఉందని ఏపీ మంత్రిని చేశారని ప్రశ్నించారు. టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులను తొలగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
టీటీడీ పాలక మండలికి చట్టాలపై అవగాహన లేదంటూ విమర్శలు చేసిన ఆయన.. తిరుమలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం చిన్న దేవాలయాలపై పడుతుందని.. ఆ విషయాన్ని గుర్తించి టీటీడీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎండోమెంట్ యాక్ట్ ని సవరించకుండా రిటైర్మెంట్ చేయటానికి వీల్లేదని.. ధార్మిక పరిషత్ ఇచ్చిన రిజల్యూషన్ నను ట్రస్టు బోర్డు కొట్టేసే వీల్లేదన్నారు. వంశపారంపర్యంగా తండ్రి తర్వాత కొడుక్కి ఆర్చకత్వం నిర్వహించొద్దన్న చంద్రబాబు.. తన కొడుక్కి మాత్రం వారసత్వంతో రాజకీయాల్లోకి ఎలా తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పూజించే నోరు.. ప్రశ్నించటం..నిలదీయటం బాబు లాంటోళ్లకు మంచిది కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
నిత్యం నీతులు చెప్పే చంద్రబాబు చేసే పనులు.. తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటివేళ.. బాబు నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేస్తున్న రంగరాజన్ సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్కు ఏ అర్హత ఉందని ఏపీ మంత్రిని చేశారని ప్రశ్నించారు. టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులను తొలగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
టీటీడీ పాలక మండలికి చట్టాలపై అవగాహన లేదంటూ విమర్శలు చేసిన ఆయన.. తిరుమలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం చిన్న దేవాలయాలపై పడుతుందని.. ఆ విషయాన్ని గుర్తించి టీటీడీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎండోమెంట్ యాక్ట్ ని సవరించకుండా రిటైర్మెంట్ చేయటానికి వీల్లేదని.. ధార్మిక పరిషత్ ఇచ్చిన రిజల్యూషన్ నను ట్రస్టు బోర్డు కొట్టేసే వీల్లేదన్నారు. వంశపారంపర్యంగా తండ్రి తర్వాత కొడుక్కి ఆర్చకత్వం నిర్వహించొద్దన్న చంద్రబాబు.. తన కొడుక్కి మాత్రం వారసత్వంతో రాజకీయాల్లోకి ఎలా తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పూజించే నోరు.. ప్రశ్నించటం..నిలదీయటం బాబు లాంటోళ్లకు మంచిది కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.