Begin typing your search above and press return to search.

చంద్రబాబు కు సొంత మీడియా వర్గాలు షాకిస్తున్నాయి!

By:  Tupaki Desk   |   13 Nov 2019 3:41 AM GMT
చంద్రబాబు కు సొంత మీడియా వర్గాలు షాకిస్తున్నాయి!
X
ఏపీ లో ఇసుక కొరత దాదాపు తీరుతోందని అని కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలు రాస్తున్నది ఎవరో కాదు, తెలుగు దేశం పార్టీ అనుకూల పత్రికలే. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డెయిలీ గా చెప్పుకునే పత్రిక ఏపీ లో ఇసుక పరిస్థితి గురించి ఆసక్తి దాయకమైన కథనం ఒకటి ఇచ్చింది. వరదలు తగ్గుముఖం పట్టడం, వాగుల్లో నీళ్లు ఖాళీ అవుతూ ఉండటం తో ఇసుక బాగా అందుబాటు లోకి వచ్చిందని ఆ పత్రిక వివరించింది.

రాష్ట్ర వ్యాప్తం గా ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంది. ఆన్ లైన్ ఇసుక బుకింగ్ లో కూడా ఇప్పుడు ఎక్కువ సమయం లభ్యమవుతూ ఉందని వివరించింది. ఆన్ లైన్ లో ఇసుక దాదాపు అరగంట సేపు అందుబాటు లో ఉంటుందని, కావాల్సిన వారు బుక్ చేసుకునే పరిస్థితి ఉందని ఆ పత్రిక కూలంకషం గా వివరించింది.

అలాగే బల్క్ బుకింగ్స్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా వివరించింది. ఇసుక ను ఎక్కువ గా బుక్ చేసుకుని, దాన్ని బ్లాక్ చేసే వాళ్ల పై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు గా వివరించింది. ఏతావాతా ఏపీ లో ఇసుక కొరత తీరినట్టే అనే విషయాన్ని ఆ పత్రిక పేర్కొంది. తెలుగు దేశం పార్టీ కి ఆస్థాన పత్రిక అయినట్టు వంటి ప్రముఖ పత్రిక లోనే ఈ కథనం వచ్చింది.

కామెడీ ఏమిటంటే..చంద్రబాబు నాయుడు దీక్ష కు కూర్చోవడానికి ఇంకా సమయం ఉంది. ఇప్పటికే ఏపీ లో ఇసుక కొరత తీరినట్టు గా ఆయన ఆస్థాన మీడియా చెబుతూ ఉంది. పరిస్థితి సద్దు మణిగిందని ఆ మీడియా నే తేల్చింది. చంద్రబాబు నాయుడు ఇసుక మీద ఒక రోజు దీక్ష చేయబోతూ ఉండ గా ఈ పరిస్థితిని వివరిస్తోంది ఆయన అనుకూల మీడియా కూడా.

ఇసుక కొరత గురించి ప్రభుత్వం మొదటి నుంచి ఇదే మాటే చెబుతూ ఉంది. వరదలు తగ్గు ముఖం పట్ట గానే ఇసుక కొరత తీరి పోతుందని చెబుతూ వచ్చింది. ఇప్పుడు అదే జరుగుతోందని చంద్రబాబు అనుకూల మీడియా నే చెప్పింది. ఇక దీక్ష చేసి చంద్రబాబు నాయుడు ఏం చెబుతారో.. అని పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు.