Begin typing your search above and press return to search.

కేంద్రం నజర్: రాజధానిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్య

By:  Tupaki Desk   |   4 Feb 2020 7:42 AM GMT
కేంద్రం నజర్: రాజధానిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్య
X
ఏపీ రాజధాని అమరావతి మార్పు వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ పరిపాలన రాజధానిగా విశాఖను చేయడంతో అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, చంద్రబాబు సహా అమరావతి లో భూములు కొన్న వారంతా బట్టలు చింపుకుంటున్న సంగతి తెలిసిందే. దీన్నో వివాదంగా రగిలిస్తున్నారు.

తాజాగా అమరావతి రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ జనసేన, బీజేపీ జట్టు కట్టి టీడీపీకి సపోర్టు గా రాజకీయం మొదలు పెట్టాయి. అమరావతిని కదిలించనీయమని ప్రతిన బూనారు.

తాజాగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనాచౌదరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఒక్క అంగుళం కూడా కదిలించలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎంటర్ అవుతుందని వైసీపీ ప్రభుత్వాన్ని బెదిరించారు.

అమరావతి విషయం లో న్యాయ పరంగా.. రాజ్యాంగ పరంగా ముందుకెళ్తామన్నారు. అభివృద్ధి పేరుతో కాలయాపన తప్ప జగన్ చేసేదేమీ లేదంటూ తీవ్ర స్థాయి లో మండి పడ్డారు.