Begin typing your search above and press return to search.
'కరోనా సెస్' విధించే యోచనలో కేంద్రం !
By: Tupaki Desk | 11 Jan 2021 6:29 PM ISTగత సంవత్సర కాలంగా దేశాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం.. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోబోతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా ను నియంత్రించడానికి నెలల తరబడి లాక్ డౌన్ ను అమలు చేయడం వల్ల నష్టపోయిన ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 20 లక్షల కోట్ల రూపాయలతో కూడిన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం వంటి కొన్ని ఉపశమన చర్యలకు సంబంధించిన రెవెన్యూ లోటును రాబట్టుకోవడానికి సెస్ విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ రాబడి అంతంతే రావడం, పైగా కరోనా వ్యాక్సిన్ ను దేశమంతా పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వాటికి అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని కేంద్రం కరోనా సెస్ ను విధించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంతో పాటు ఆదాయాన్ని పెంచే చర్యలపై కేంద్రం ఇప్పటికే నిపుణులతో ఓ ప్రాథమిక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సెస్ లేదా సర్చార్జీ రూపంలో కొత్త లేవీని విధించే విషయంలో మాత్రం కేంద్రం ఇంకా ఓ తుది నిర్ణయానికి రాలేదు. అయితే ఈ నిర్ణయాన్ని పరిశ్రమలు, ఆర్థిక నిపుణులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనల్లో వాటిని చేర్చుతారని చెబుతున్నారు.బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించేబోయే మంత్రివర్గ సమావేశంలో కరోనా సెస్ లేదా కోవిడ్ సర్ఛార్జ్ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని, త్వరలోనే దీనికి తుది రూపాన్ని ఇస్తుందని చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయంపై ఇది పూర్తిగా ఆధారపడి ఉండొచ్చని, కేబినెట్ ఆమోదిస్తే.. కరోనా వైరస్ సెస్ ప్రతిపాదనలను బడ్జెట్ లో చేర్చుతారని అంటున్నారు.నూతన బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్రం వివిధ పారిశ్రామిక వేత్తల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో ఓ భేటీ నిర్వహించింది. ప్రస్తుత సమయంలో కొత్త కొత్త పన్నులను విధించరాదని, ఇది ఎంత మాత్రం సరైన నిర్ణయం కాదని కేంద్రానికి తెగేసి చెప్పారు. నూతన సెస్ను విధించే విషయంలో మాత్రం అధికారుల మధ్య చర్చలు జరిగినట్లు కొందరు స్పష్టం చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ రాబడి అంతంతే రావడం, పైగా కరోనా వ్యాక్సిన్ ను దేశమంతా పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వాటికి అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని కేంద్రం కరోనా సెస్ ను విధించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంతో పాటు ఆదాయాన్ని పెంచే చర్యలపై కేంద్రం ఇప్పటికే నిపుణులతో ఓ ప్రాథమిక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సెస్ లేదా సర్చార్జీ రూపంలో కొత్త లేవీని విధించే విషయంలో మాత్రం కేంద్రం ఇంకా ఓ తుది నిర్ణయానికి రాలేదు. అయితే ఈ నిర్ణయాన్ని పరిశ్రమలు, ఆర్థిక నిపుణులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనల్లో వాటిని చేర్చుతారని చెబుతున్నారు.బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించేబోయే మంత్రివర్గ సమావేశంలో కరోనా సెస్ లేదా కోవిడ్ సర్ఛార్జ్ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని, త్వరలోనే దీనికి తుది రూపాన్ని ఇస్తుందని చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయంపై ఇది పూర్తిగా ఆధారపడి ఉండొచ్చని, కేబినెట్ ఆమోదిస్తే.. కరోనా వైరస్ సెస్ ప్రతిపాదనలను బడ్జెట్ లో చేర్చుతారని అంటున్నారు.నూతన బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్రం వివిధ పారిశ్రామిక వేత్తల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో ఓ భేటీ నిర్వహించింది. ప్రస్తుత సమయంలో కొత్త కొత్త పన్నులను విధించరాదని, ఇది ఎంత మాత్రం సరైన నిర్ణయం కాదని కేంద్రానికి తెగేసి చెప్పారు. నూతన సెస్ను విధించే విషయంలో మాత్రం అధికారుల మధ్య చర్చలు జరిగినట్లు కొందరు స్పష్టం చేస్తున్నారు.
